Tirumala: ముగిసిన శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు.. తిరుపతిని కూడా తిరుమల తరహాలో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలో శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన సదస్సులో 62 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సూచనలు, సలహాలు ఇచ్చారు. మూడు రోజులు పాటు జరిగిన ధార్మిక సదస్సులో అనేక తీర్మానాలు చేశామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. హిందు మతాని నమ్మి, ఈ ధర్మాని ఆచరించాలన్న ఇతర మతస్థులకు తిరుమల క్షేత్రంలో ఒక వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర మతస్థులు హిందూ మతంలోకి మారేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తే, తిరుమలలో మతమార్పిడి చేయించి వారికి శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు. ప్రవచన కర్తలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని ఆయన చెప్పారు. తిరుపతిని కూడా తిరుమల తరహాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
Read Also: AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ.. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
మతాంతీకరణలు అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. శిథిలావస్థలో వున్న ఆలయాలు పునరుద్ధరణ చెయ్యడంతో పాటు బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతంలో నూతన ఆలయాలు నిర్మిస్తామన్నారు. గో సంరక్షణ చేయాలని ఈ సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. యువకులలో ధార్మిక భావాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. తిరుమలలో వున్న 108 తీర్థాలను భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ద్రవిడ వేదానికి ప్రాచూర్యం కల్పించేలా ఏర్పాట్లు చేశామని.. పాఠశాల విద్యార్థులకు హైందవ ధర్మం పట్ల అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సోషల్ మీడియా ద్వారా హిందూ ధార్మిక కార్యక్రమాలను ప్రచారం చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ధార్మిక సంస్థలను ఏకీకృతం చెయ్యడం, టీటీడీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం, గ్రామ స్థాయిలో సదస్సుని నిర్వహించడంతో పాటు ఏడాదికి ఒక్కసారి ధార్మిక సదస్సును నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!