AP Elections: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
- తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
- 50 మంది సభ్యులలో కేవలం 22 మంది మాత్రమే హాజరు.
- ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం (50%) లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్య పరిణామాలతో వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ, 50 మంది సభ్యులలో కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం (50%) లేకపోవడంతో ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. తిరుపతి రాజకీయాలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠకు గురయ్యాయి. ఆదివారం రాత్రి కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆరోపణల ప్రకారం, కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా హోటళ్లకు తరలించారని తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read: Bunny Vasu: పవన్ కళ్యాణ్ ఒకసారి పక్కన పెడితే కష్టం.. బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు!
Also Read
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
కూటమి నుంచి మునికృష్ణను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించగా, వైసీపీ చివరి నిమిషంలో లడ్డు భాస్కర్ను రంగంలోకి దించింది. అయితే, వైసీపీ అభ్యర్థికి మద్దతు తగ్గడంతో వారి కార్పొరేటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. కూటమికి 30 మంది కార్పొరేటర్ల మద్దతు ఉండగా, వైసీపీ మేయర్ అభ్యర్థి వైపు కార్పొరేటర్లు పెద్దగా ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగాల్సి ఉంది. కూటమి కార్పొరేటర్లు ముందుగానే హాజరయ్యారు. అయితే, వైసీపీ కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో ఎన్నికా కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడి, కొందరు అనుచరులు బస్సుపై దాడి చేసి కార్పొరేటర్లను కారులో తీసుకెళ్లారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటన తర్వాత వైసీపీ కార్పొరేటర్లు, మేయర్, ఎంపీ ఈ ఎన్నికలను బహిష్కరించారు. తమ కార్పొరేటర్లను విడుదల చేయకుండా ఎన్నికలు జరిగితే, న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ మరింత పెరిగింది. రేపటి ఎన్నికలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!