Tirumala TTD: వెంకన్న స్వామి భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు కట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు తాజాగా టీటీడీ ముఖ్య గమనికను తెలిపింది. ప్రస్తుతం వేసవికాలం సెలవులు కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల తాకడితో కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉండగా రోజురోజుకి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం నాడు 65 వేల మందిపైగా స్వామివారిని దర్శించుకోగా.. అందులో 36 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. గురువారం నాడు హుండీ ద్వారా 3.51 కోట్ల రూపాయల ఆదాయం టిటిడికి లభించింది. స్వామివారి దర్శనానికి సర్వ దర్శనం టోకెన్లు తీసుకున్న వారికి 20 గంటలకు పైన సమయం పడుతుంది.
దీంతో భక్తులు అసౌకర్యం గురి కాకుండా టీటీడీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచినీరు, పాలు, అల్పాహారం లాంటి వాటిని టీటీడీ భక్తులకు అధికారులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారంలో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎలాంటి సిఫారసు లేకలను కూడా స్వీకరించబోమని టీటీడీ అధికారులు తెలిపారు.
Also Read
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
ఈ రూల్స్ తక్షణం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 30వ తేదీ వరకు ఈ రూల్స్ కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కేవలం సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారాల్లో మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం అందుబాటులో ఉండనుంది. కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలంటూ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం