Tirumala TTD: వెంకన్న స్వామి భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు కట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు తాజాగా టీటీడీ ముఖ్య గమనికను తెలిపింది. ప్రస్తుతం వేసవికాలం సెలవులు కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల తాకడితో కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉండగా రోజురోజుకి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం నాడు 65 వేల మందిపైగా స్వామివారిని దర్శించుకోగా.. అందులో 36 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. గురువారం నాడు హుండీ ద్వారా 3.51 కోట్ల రూపాయల ఆదాయం టిటిడికి లభించింది. స్వామివారి దర్శనానికి సర్వ దర్శనం టోకెన్లు తీసుకున్న వారికి 20 గంటలకు పైన సమయం పడుతుంది.
దీంతో భక్తులు అసౌకర్యం గురి కాకుండా టీటీడీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచినీరు, పాలు, అల్పాహారం లాంటి వాటిని టీటీడీ భక్తులకు అధికారులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారంలో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎలాంటి సిఫారసు లేకలను కూడా స్వీకరించబోమని టీటీడీ అధికారులు తెలిపారు.
Also Read
ఈ రూల్స్ తక్షణం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 30వ తేదీ వరకు ఈ రూల్స్ కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కేవలం సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారాల్లో మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం అందుబాటులో ఉండనుంది. కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలంటూ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!