Kejriwal: కేజ్రీవాల్ హెల్త్పై అధికారులు కీలక రిపోర్ట్! ఆందోళనలో ఆప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. సోమవారం ఆయన్ను జైలుకు తరలించారు. ఏప్రిల్ 15 వరకు రౌస్ అవెన్యూ కోర్టు… జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య జైలుకు తరలించారు. అయితే కేజ్రీవాల్ ఆరోగ్యంపై జైలు అధికారులు కీలక రిపోర్టు విడుదల చేశారు. తొలి రోజు కేజ్రీవాల్ నీరసంగా ఉన్నారని.. అలాగే షుగర్ లెవల్స్ పడిపోయాయని అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి కేజ్రీవాల్ కొద్ది సేపు మాత్రమే నిద్ర పోయినట్లు తెలిపారు.
ఇది కూాడా చదవండి: Tollywood: టాలీవుడ్లో వరుస విషాదాలు.. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురి మృతి!
Also Read
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను ఈడీ కస్టడీకి రెండు సార్లు అనుమతి ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను సోమవారం సాయంత్రం 4 గంటలకు తీహార్ జైలుకు తరలించారు. ఇక సెల్లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయి 50 కంటే తక్కువ ఉందని తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఔషధాలు అందించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. జైల్లో ఆయనకు ఓ పరుపు, దుప్పట్లు, రెండు దిండ్లు అందించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించారు. రాత్రి కొద్దిసేపు కటిక నేలపైనే పడుకున్నారని, అర్థరాత్రి వరకూ సెల్లో అటు, ఇటు తిరుగుతూ కనిపించారని జైలు వర్గాలు వెల్లడించాయి.
ఇది కూాడా చదవండి: PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..
ఇక మంగళవారం ఉదయాన్నే ధ్యానం చేసుకున్న కేజ్రీవాల్కు.. అనంతరం చాయ్, రెండు బిస్కట్లు అందించారు. అనంతరం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం ఆయన జైలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతిస్తామని, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేవరకు వీటిని కొనసాగిస్తామని చెప్పారు.
సెల్ బయట జైలు వార్డర్తోపాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించారు. అత్యవసనర సేవల సిబ్బందినీ సెల్ సమీపంలో సిద్ధంగా ఉంచారు. సీసీకెమెరాల ద్వారా ఆయన్ను ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. కోరిన విధంగానే ఆయనకు రామాయణం, భగవద్గీత పుస్తకాలను అందించారు. అలాగే ఆయన మెడలో ఉన్న లాకెట్ను కూడా అనుమతించారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సతీమణి సునీతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది కూాడా చదవండి: Pushpa2 The Rule Teaser: పుష్ప గాడి కాళ్లకు గజ్జెలు కట్టి.. అద్దీ.. అట్టా హైప్ పెంచు మావ!
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!