Kejriwal: కేజ్రీవాల్ హెల్త్పై అధికారులు కీలక రిపోర్ట్! ఆందోళనలో ఆప్!
ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. సోమవారం ఆయన్ను జైలుకు తరలించారు. ఏప్రిల్ 15 వరకు రౌస్ అవెన్యూ కోర్టు… జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య జైలుకు తరలించారు. అయితే కేజ్రీవాల్ ఆరోగ్యంపై జైలు అధికారులు కీలక రిపోర్టు విడుదల చేశారు. తొలి రోజు కేజ్రీవాల్ నీరసంగా ఉన్నారని.. అలాగే షుగర్ లెవల్స్ పడిపోయాయని అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి కేజ్రీవాల్ కొద్ది సేపు మాత్రమే నిద్ర పోయినట్లు తెలిపారు.
ఇది కూాడా చదవండి: Tollywood: టాలీవుడ్లో వరుస విషాదాలు.. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురి మృతి!
Also Read
మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను ఈడీ కస్టడీకి రెండు సార్లు అనుమతి ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను సోమవారం సాయంత్రం 4 గంటలకు తీహార్ జైలుకు తరలించారు. ఇక సెల్లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయి 50 కంటే తక్కువ ఉందని తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఔషధాలు అందించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. జైల్లో ఆయనకు ఓ పరుపు, దుప్పట్లు, రెండు దిండ్లు అందించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించారు. రాత్రి కొద్దిసేపు కటిక నేలపైనే పడుకున్నారని, అర్థరాత్రి వరకూ సెల్లో అటు, ఇటు తిరుగుతూ కనిపించారని జైలు వర్గాలు వెల్లడించాయి.
ఇది కూాడా చదవండి: PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..
ఇక మంగళవారం ఉదయాన్నే ధ్యానం చేసుకున్న కేజ్రీవాల్కు.. అనంతరం చాయ్, రెండు బిస్కట్లు అందించారు. అనంతరం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం ఆయన జైలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతిస్తామని, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేవరకు వీటిని కొనసాగిస్తామని చెప్పారు.
సెల్ బయట జైలు వార్డర్తోపాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించారు. అత్యవసనర సేవల సిబ్బందినీ సెల్ సమీపంలో సిద్ధంగా ఉంచారు. సీసీకెమెరాల ద్వారా ఆయన్ను ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. కోరిన విధంగానే ఆయనకు రామాయణం, భగవద్గీత పుస్తకాలను అందించారు. అలాగే ఆయన మెడలో ఉన్న లాకెట్ను కూడా అనుమతించారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సతీమణి సునీతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది కూాడా చదవండి: Pushpa2 The Rule Teaser: పుష్ప గాడి కాళ్లకు గజ్జెలు కట్టి.. అద్దీ.. అట్టా హైప్ పెంచు మావ!
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!