TS Police: కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత.. 23 వేల మంది పహారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత కొనసాగుతుంది. సుమారు 23 వేల మంది సిబ్బంది పహారా నిర్వహిస్తున్నామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో, రహదారులపై పటాకులు కాల్చేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించడంతో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని పోలీసులు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంచేందుకు అందరూ సహకరించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. పర్మిషన్ ఉన్నవాళ్లు మినహా ఇతరులు ఆ పరిసరాల్లోకి రావొద్దని పేర్కొన్నారు.
Read Also: D.K Shivakumar: రంగంలోకి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్.. హైదరాబాద్ లో దిగిన డీకే శివకుమార్
Also Read
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
ఇక, ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ ఎప్పటికప్పుడు స్పెషల్ బ్రాంచ్కు తెలియజేయాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లోకి ఎవరు రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని ఆయన పేర్కొన్నారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైతే పోలీస్ పికెట్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు, వారి ఆస్తులకు సైతం భద్రత కల్పించాలి.. జిల్లాల్లోని పోలీసు ఉన్నతాధికారులు ఇరు పక్షాల రాజకీయ నాయకులతో మాట్లాడుతూ.. సమన్వయం చేసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఎత్తివేసే వరకూ ముఖ్యంగా సోమవారం వరకు ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని డీజీపీ పేర్కొన్నారు.
Read Also: Telangana Election Results 2023: ఓపెన్ చేసి దర్శనమిచ్చిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు?
అయితే, ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో పాటు అగ్నిమాపకశాఖ సిబ్బంది సైతం డ్యూటీ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఫైర్ టెండర్లు, మిస్ట్ బుల్లెట్లు, మంటలు ఆర్పివేసే సిబ్బందిని రెడీగా ఉంచినట్లు ఏడీజీ వై నాగిరెడ్డి చెప్పారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎప్పటికిప్పుడు పరిస్థితిని సమీక్షస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సుమారు 300 మంది సిబ్బందితో, ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచామని ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!