CM Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్
- సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు ముగ్గురు ఎమ్మెల్సీలు
- టీడీపీలో చేరిన కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు ముగ్గురు ఎమ్మెల్సీలు. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరారు. మా రాజీనామాలు ఇప్పటివరకు ఆమోదించలేదన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలలుగా వేచి చూశాం. రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదు. మండలి చైర్మన్ వెనుక ఉండి నడిపించేవారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదని మర్రి రాజశేఖర్ తెలిపారు.
Also Read:India: సౌదీ అరేబియా వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.. పాక్తో రక్షణ ఒప్పందంపై భారత్..
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
నేను మార్చ్ 19 న ఎమ్మెల్సీ కి రాజీనామా చేసానన్నారు. పార్టీకి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే టీడీపీ లో చేర్చుకుంటాం అని చెప్పారు. 6 నెలలు అయింది.. మా రాజీనామాలు మండలి చైర్మన్ ఆమోదించలేదన్నారు. మండలి చైర్మన్ వెనక ఉండి నడిపించే వారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదన్నారు. ఆమోదిస్తారని నమ్మకం లేదు.. సీఎం చంద్రబాబు నాయకత్వం లో పాలన బావుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు బాగా తీసుకుంటున్నారు.. అమరావతిలో అభివృద్ధి జరుగుతోందన్నారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు లోకేష్ బాగా కృషి చేస్తున్నారు. మా సహాయం కూడా అందించాలని టీడీపీ లో చేరామని తెలిపారు.
సోమవారం మండలికి వెళ్తాము డిస్ క్వాలిఫై చేస్తారో.. రాజీనామా అమోదిస్తారో చూద్దాం.. ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. తిరిగి టీడీపీ సొంత గూటికి రావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ కి రాజీనామా చేసి 13 నెలలు అయింది. మా రాజీనామాలు ఆపి…ఆమోదించకుండా.. మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారన్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకు వెళ్తోంది.. రాష్ట్ర అభివృద్ధి లో భాగస్వాములు అవ్వడం కోసం టీడీపీ లో చేరామని తెలిపారు.
Also Read:AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్, బెంగళూరుతో సహా ఎనిమిది చోట్ల ఈడీ దాడులు
కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. నేను 2024 ఆగస్ట్ 30 న రాజీనామా చేసాను.. ఏడాది పాటు నా రాజీనామ ఆమోదించలేదు.. ప్రజలకు ఎలాంటి సేవ చేయలేకపోయాము.. ప్రజల అభివృద్ధి కోసం ముందడుగు వేసే వారే లీడర్. రాష్ట్ర అభివృద్ధి లో భాగస్వామ్యం కోసం. టీడీపీ లో చేరామని అన్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!