AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్, బెంగళూరుతో సహా ఎనిమిది చోట్ల ఈడీ దాడులు
- ఏపీ లిక్కర్ స్కాం
- హైదరాబాద్, బెంగళూరుతో సహా ఎనిమిది చోట్ల ఈడీ దాడులు
ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన రూ. 4000 కోట్ల లిక్కర్ స్కాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, హైదరాబాద్ జోనల్ ఆఫీస్ భారీ దాడులు నిర్వహించింది. పీఎంఎల్ఏ చట్టం, 2002 కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్పూర్, ఢిల్లీ ఎన్సీఆర్, ఆంధ్రప్రదేశ్లోని 20 ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్లు చేపట్టింది.
Also Read:Vikarabad : వికారాబాద్ పూడూర్లో పనిమనిషిని మోసగించి భూమి కాజేసిన యజమానులు
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
స్కాం వివరాలు
ఏపీ సీఐడీ ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి మధ్య అమలు చేసిన కొత్త లిక్కర్ పాలసీ కిందే భారీ మోసాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాపులర్ బ్రాండ్లు (McDowell’s, Royal Stag, Imperial Blue వంటి) కిక్బ్యాక్లు ఇవ్వడానికి నిరాకరించగా, వాటిని పక్కనబెట్టి కొత్త / నకిలీ బ్రాండ్లను ప్రోత్సహించారు. ఆటోమేటెడ్ సిస్టమ్ను తొలగించి మాన్యువల్ ఆర్డర్ సిస్టమ్కి మారడం ద్వారా సప్లై వాల్యూమ్లో భారీ మోసాలు జరిగాయి.
SIT ఛార్జీషీట్లో ఆరోపణలు
డిస్టిలరీలు, మార్కెటింగ్ సంస్థలను బలవంతపెట్టి ఇన్వాయిస్ విలువలో 15–20% కిక్బ్యాక్ వసూలు చేశారు. చెల్లింపులు ఆలస్యపరచడం, షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లించడం, అర్హత నిబంధనలను వక్రీకరించడం వంటి విషయాలు ఛార్జీషీట్లో ఉన్నాయి. సేకరించిన నిధులను ఎన్నికల ఖర్చులకు, వ్యక్తిగత లాభాల కోసం, విదేశాలకు పంపించడానికి ఉపయోగించారని SIT తేల్చింది.
ED దర్యాప్తు ఫలితాలు
ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) సరఫరాదారులకు ఇచ్చిన చెల్లింపుల్లో కొంత భాగం బోగస్ కంపెనీలు, షెల్ ఎంటిటీలకు తరలించబడిందని ED గుర్తించింది. సరఫరాదారులు కొంత డబ్బును జువెలర్స్కి ఇచ్చి బంగారం, నగదు రూపంలో తిరిగి కిక్బ్యాక్ ఇచ్చారని తేల్చారు. అనుమానాస్పద ట్రాన్సాక్షన్లలో దుబాయ్లో ఉన్న కొందరు కూడా సంబంధం కలిగి ఉన్నారని ఆధారాలు లభించాయి.
Also Read:Amisha Patel : నాలో సగం ఏజ్ ఉన్న వాళ్లతో డేటింగ్ చేస్తా.. మహేశ్ బాబు హీరోయిన్ ఆఫర్..
స్వాధీనం చేసిన వస్తువులు
బోగస్ ఇన్వాయిసులు, ట్రాన్స్పోర్ట్ చలాన్లు, వేరే ధరలతో ఉన్న పారలల్ ఇన్వాయిసులు దొరికాయి. నిందితుల మధ్య వాట్సాప్ చాట్స్, దుబాయ్కు పంపిన డబ్బుల లెడ్జర్లు బయటపడ్డాయి. ఒక ప్రదేశం నుంచి రూ. 38 లక్షల అక్రమ నగదును ED స్వాధీనం చేసుకుంది. మొత్తంగా, ఏపీ లిక్కర్ స్కాంలో డబ్బు మళ్లింపులు, బోగస్ ట్రాన్సాక్షన్లు, కిక్బ్యాక్లకు సంబంధించిన పక్కా ఆధారాలు దొరకడంతోఈడీ దర్యాప్తు మరింత వేగవంతమైంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?