AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్, బెంగళూరుతో సహా ఎనిమిది చోట్ల ఈడీ దాడులు
- ఏపీ లిక్కర్ స్కాం
- హైదరాబాద్, బెంగళూరుతో సహా ఎనిమిది చోట్ల ఈడీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన రూ. 4000 కోట్ల లిక్కర్ స్కాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, హైదరాబాద్ జోనల్ ఆఫీస్ భారీ దాడులు నిర్వహించింది. పీఎంఎల్ఏ చట్టం, 2002 కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్పూర్, ఢిల్లీ ఎన్సీఆర్, ఆంధ్రప్రదేశ్లోని 20 ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్లు చేపట్టింది.
Also Read:Vikarabad : వికారాబాద్ పూడూర్లో పనిమనిషిని మోసగించి భూమి కాజేసిన యజమానులు
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
స్కాం వివరాలు
ఏపీ సీఐడీ ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి మధ్య అమలు చేసిన కొత్త లిక్కర్ పాలసీ కిందే భారీ మోసాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాపులర్ బ్రాండ్లు (McDowell’s, Royal Stag, Imperial Blue వంటి) కిక్బ్యాక్లు ఇవ్వడానికి నిరాకరించగా, వాటిని పక్కనబెట్టి కొత్త / నకిలీ బ్రాండ్లను ప్రోత్సహించారు. ఆటోమేటెడ్ సిస్టమ్ను తొలగించి మాన్యువల్ ఆర్డర్ సిస్టమ్కి మారడం ద్వారా సప్లై వాల్యూమ్లో భారీ మోసాలు జరిగాయి.
SIT ఛార్జీషీట్లో ఆరోపణలు
డిస్టిలరీలు, మార్కెటింగ్ సంస్థలను బలవంతపెట్టి ఇన్వాయిస్ విలువలో 15–20% కిక్బ్యాక్ వసూలు చేశారు. చెల్లింపులు ఆలస్యపరచడం, షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లించడం, అర్హత నిబంధనలను వక్రీకరించడం వంటి విషయాలు ఛార్జీషీట్లో ఉన్నాయి. సేకరించిన నిధులను ఎన్నికల ఖర్చులకు, వ్యక్తిగత లాభాల కోసం, విదేశాలకు పంపించడానికి ఉపయోగించారని SIT తేల్చింది.
ED దర్యాప్తు ఫలితాలు
ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) సరఫరాదారులకు ఇచ్చిన చెల్లింపుల్లో కొంత భాగం బోగస్ కంపెనీలు, షెల్ ఎంటిటీలకు తరలించబడిందని ED గుర్తించింది. సరఫరాదారులు కొంత డబ్బును జువెలర్స్కి ఇచ్చి బంగారం, నగదు రూపంలో తిరిగి కిక్బ్యాక్ ఇచ్చారని తేల్చారు. అనుమానాస్పద ట్రాన్సాక్షన్లలో దుబాయ్లో ఉన్న కొందరు కూడా సంబంధం కలిగి ఉన్నారని ఆధారాలు లభించాయి.
Also Read:Amisha Patel : నాలో సగం ఏజ్ ఉన్న వాళ్లతో డేటింగ్ చేస్తా.. మహేశ్ బాబు హీరోయిన్ ఆఫర్..
స్వాధీనం చేసిన వస్తువులు
బోగస్ ఇన్వాయిసులు, ట్రాన్స్పోర్ట్ చలాన్లు, వేరే ధరలతో ఉన్న పారలల్ ఇన్వాయిసులు దొరికాయి. నిందితుల మధ్య వాట్సాప్ చాట్స్, దుబాయ్కు పంపిన డబ్బుల లెడ్జర్లు బయటపడ్డాయి. ఒక ప్రదేశం నుంచి రూ. 38 లక్షల అక్రమ నగదును ED స్వాధీనం చేసుకుంది. మొత్తంగా, ఏపీ లిక్కర్ స్కాంలో డబ్బు మళ్లింపులు, బోగస్ ట్రాన్సాక్షన్లు, కిక్బ్యాక్లకు సంబంధించిన పక్కా ఆధారాలు దొరకడంతోఈడీ దర్యాప్తు మరింత వేగవంతమైంది.
తాజావార్తలు
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!