TMC Party: ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు..
- ముగ్గురు బెంగాల్ బీజేపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు..
- త్వరలో లోక్సభలో బీజేపీ బలం 237కి తగ్గుతుంది..
- భారత కూటమి ఎంపీల సంఖ్య 240కి పెరుగుతుంది: టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుతం టీడీపీ, జేడీయూ లాంటి మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు పార్టీ మారితే కష్టమే. ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు.. త్వరలో లోక్సభలో బీజేపీ బలం 237కి తగ్గుతుందని ఆయన తెలిపారు. అలాగే, భారత కూటమి ఎంపీల సంఖ్య 240కి పెరుగుతుందన్నారు. నరేంద్రమోడీ పొత్తు నిలకడగా లేదన్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదని ఎంపీ సాకేత్ గోఖలే తెలిపారు.
Read Also: Chandrababu Naidu Oath Ceremony Live Updates: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్డేట్స్
Also Read
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
అయితే, టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ బీజేపీ స్పందిస్తూ.. అలాంటి వాదనలు నిరాధారమని పేర్కొంది. పార్టీ రాష్ట్ర శాఖ ఐక్యంగా ఉందని వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీలు ఎవరూ టచ్లో లేరని తెలిపారు. టీఎంసీ పగటి కలలు కంటోంది.. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన శక్తిగా ఎదగాలని మమతా బెనర్జీ కలలు కంటోంది అని బెంగాల్ బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇక, లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాల్లో గెలిచింది. ఇక, బీజేపీ సీట్ల సంఖ్య 2019లో 18 నుంచి 2024లో 12కి తగ్గింది. అలాగే, తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన మెజారిటీ మార్క్ను కోల్పోయింది.. అయితే ఎన్డీయే కూటమికి 293 సీట్లు రావడంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, ‘భారత్’ కూటమి 234 సీట్లలో విజయం సాధించింది. ఎన్నికల తర్వాత గెలిచిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడంతో ప్రతిపక్ష కూటమి బలం 236కి చేరుకుంది.
తాజావార్తలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!