TMC Party: ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు..
- ముగ్గురు బెంగాల్ బీజేపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు..
- త్వరలో లోక్సభలో బీజేపీ బలం 237కి తగ్గుతుంది..
- భారత కూటమి ఎంపీల సంఖ్య 240కి పెరుగుతుంది: టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుతం టీడీపీ, జేడీయూ లాంటి మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు పార్టీ మారితే కష్టమే. ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు.. త్వరలో లోక్సభలో బీజేపీ బలం 237కి తగ్గుతుందని ఆయన తెలిపారు. అలాగే, భారత కూటమి ఎంపీల సంఖ్య 240కి పెరుగుతుందన్నారు. నరేంద్రమోడీ పొత్తు నిలకడగా లేదన్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదని ఎంపీ సాకేత్ గోఖలే తెలిపారు.
Read Also: Chandrababu Naidu Oath Ceremony Live Updates: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్డేట్స్
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
అయితే, టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ బీజేపీ స్పందిస్తూ.. అలాంటి వాదనలు నిరాధారమని పేర్కొంది. పార్టీ రాష్ట్ర శాఖ ఐక్యంగా ఉందని వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీలు ఎవరూ టచ్లో లేరని తెలిపారు. టీఎంసీ పగటి కలలు కంటోంది.. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన శక్తిగా ఎదగాలని మమతా బెనర్జీ కలలు కంటోంది అని బెంగాల్ బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇక, లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాల్లో గెలిచింది. ఇక, బీజేపీ సీట్ల సంఖ్య 2019లో 18 నుంచి 2024లో 12కి తగ్గింది. అలాగే, తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన మెజారిటీ మార్క్ను కోల్పోయింది.. అయితే ఎన్డీయే కూటమికి 293 సీట్లు రావడంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, ‘భారత్’ కూటమి 234 సీట్లలో విజయం సాధించింది. ఎన్నికల తర్వాత గెలిచిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడంతో ప్రతిపక్ష కూటమి బలం 236కి చేరుకుంది.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!