Gun Firing: పోలీసులకు బహిరంగంగా సవాలు.. మార్కెట్లో కాల్పులు జరిపి రూ.10 కోట్లు డిమాండ్
- ఢిల్లీలో మళ్లీ దోపిడీ రాజ్యం.
- పోలీసులకు బహిరంగంగా సవాలు..
- మార్కెట్లో కాల్పులు జరిపి రూ.10 కోట్లు డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Firing: ఢిల్లీలో మళ్లీ దోపిడీ రాజ్యం మొదలైంది. ఔటర్ ఢిల్లీలోని నాంగ్లోయ్లోని ఫర్నిచర్ దుకాణం, ఔటర్-నార్త్ ఢిల్లీలోని అలీపూర్లోని ప్రాపర్టీ డీలర్ కార్యాలయంపై కాల్పులు జరిపి ముగ్గురు దుండగులు ఢిల్లీ పోలీసులకు బహిరంగంగా సవాలు విసిరారు. అయితే ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నాంగ్లోయ్ ఘటనలో కాల్పులు జరిపిన ముష్కరులు కరపత్రాన్ని విడిచిపెట్టారు. స్లిప్లో గ్యాంగ్స్టర్ అంకేష్ లక్రా పేరు రాసి రూ.10 కోట్ల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దుండగులను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వరకు నిందితుల ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందాలు దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి.
Also Read: Bus Accident: అదుపు తప్పిన బస్సు.. పోలీస్ కానిస్టేబుల్తో సహా మరో వ్యక్తి మృతి
Also Read
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
ఇకపోతే, ఢిల్లీ పోలీసు అదనపు పోలీసు కమిషనర్ రాజీవ్ రంజన్ ఈ ఘటనను ధృవీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన సమయంలో బాధితుడు తన దుకాణంలో ఉన్నాడు. అప్పుడు ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు అతని దుకాణానికి వచ్చి గాలిలోకి కాల్పులు ప్రారంభించారు. దుండగులు గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరిపి స్కూటర్పై పారిపోయారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్, క్రైమ్ టీమ్ రంగంలోకి దిగింది.
Also Read: Revanth Reddy: బలహీనుడి గళం.. సామాజిక న్యాయ రణం.. రాహుల్ గాంధీకి స్వాగతం..
దుండగులను గుర్తించామని, వారిని అరెస్టు చేయడానికి అనేక బృందాలను నియమించామని పోలీసు అధికారి పేర్కొన్నారు. అయితే ఘటన జరిగిన తీరు చూస్తే ఎవరికైనా ప్రాణహాని ఉండేదని బాధిత దుకాణదారు చెబుతున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని, డబ్బు కోసం మాత్రమే అక్రమార్కులు కాల్పులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఫర్నీచర్ షాపుపై కాల్పులు జరిపిన దుండగులు గ్యాంగ్ స్టర్ అంకేష్ లక్రా పేరు రాసి ఉన్న స్లిప్ ను వదిలేశారు. అందులో వారు 10 కోట్లు డిమాండ్ చేసారు. ఫిర్యాదుదారుడి వాంగ్మూలం ఆధారంగా నిందితులను కూడా గుర్తించారు. త్వరలో అందరినీ అరెస్టు చేస్తామని పొలిసు అధికారులు అన్నారు. అయితే, ఎంత విమోచనం డిమాండ్ చేశారనే దానిపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.
#WATCH | Delhi: Information was received about an incident of firing at a shop in PS Nangloi area. The complainant said that three boys with their faces covered came to the shop, fired several rounds in the air and ran away. A case is being registered. Search for the accused is… pic.twitter.com/iiNwTwaqBm
— ANI (@ANI) November 4, 2024
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!