Gun Firing: పోలీసులకు బహిరంగంగా సవాలు.. మార్కెట్లో కాల్పులు జరిపి రూ.10 కోట్లు డిమాండ్
- ఢిల్లీలో మళ్లీ దోపిడీ రాజ్యం.
- పోలీసులకు బహిరంగంగా సవాలు..
- మార్కెట్లో కాల్పులు జరిపి రూ.10 కోట్లు డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Firing: ఢిల్లీలో మళ్లీ దోపిడీ రాజ్యం మొదలైంది. ఔటర్ ఢిల్లీలోని నాంగ్లోయ్లోని ఫర్నిచర్ దుకాణం, ఔటర్-నార్త్ ఢిల్లీలోని అలీపూర్లోని ప్రాపర్టీ డీలర్ కార్యాలయంపై కాల్పులు జరిపి ముగ్గురు దుండగులు ఢిల్లీ పోలీసులకు బహిరంగంగా సవాలు విసిరారు. అయితే ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నాంగ్లోయ్ ఘటనలో కాల్పులు జరిపిన ముష్కరులు కరపత్రాన్ని విడిచిపెట్టారు. స్లిప్లో గ్యాంగ్స్టర్ అంకేష్ లక్రా పేరు రాసి రూ.10 కోట్ల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దుండగులను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వరకు నిందితుల ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందాలు దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి.
Also Read: Bus Accident: అదుపు తప్పిన బస్సు.. పోలీస్ కానిస్టేబుల్తో సహా మరో వ్యక్తి మృతి
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ఇకపోతే, ఢిల్లీ పోలీసు అదనపు పోలీసు కమిషనర్ రాజీవ్ రంజన్ ఈ ఘటనను ధృవీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన సమయంలో బాధితుడు తన దుకాణంలో ఉన్నాడు. అప్పుడు ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు అతని దుకాణానికి వచ్చి గాలిలోకి కాల్పులు ప్రారంభించారు. దుండగులు గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరిపి స్కూటర్పై పారిపోయారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్, క్రైమ్ టీమ్ రంగంలోకి దిగింది.
Also Read: Revanth Reddy: బలహీనుడి గళం.. సామాజిక న్యాయ రణం.. రాహుల్ గాంధీకి స్వాగతం..
దుండగులను గుర్తించామని, వారిని అరెస్టు చేయడానికి అనేక బృందాలను నియమించామని పోలీసు అధికారి పేర్కొన్నారు. అయితే ఘటన జరిగిన తీరు చూస్తే ఎవరికైనా ప్రాణహాని ఉండేదని బాధిత దుకాణదారు చెబుతున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని, డబ్బు కోసం మాత్రమే అక్రమార్కులు కాల్పులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఫర్నీచర్ షాపుపై కాల్పులు జరిపిన దుండగులు గ్యాంగ్ స్టర్ అంకేష్ లక్రా పేరు రాసి ఉన్న స్లిప్ ను వదిలేశారు. అందులో వారు 10 కోట్లు డిమాండ్ చేసారు. ఫిర్యాదుదారుడి వాంగ్మూలం ఆధారంగా నిందితులను కూడా గుర్తించారు. త్వరలో అందరినీ అరెస్టు చేస్తామని పొలిసు అధికారులు అన్నారు. అయితే, ఎంత విమోచనం డిమాండ్ చేశారనే దానిపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.
#WATCH | Delhi: Information was received about an incident of firing at a shop in PS Nangloi area. The complainant said that three boys with their faces covered came to the shop, fired several rounds in the air and ran away. A case is being registered. Search for the accused is… pic.twitter.com/iiNwTwaqBm
— ANI (@ANI) November 4, 2024
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..