Gun Firing: పోలీసులకు బహిరంగంగా సవాలు.. మార్కెట్లో కాల్పులు జరిపి రూ.10 కోట్లు డిమాండ్
- ఢిల్లీలో మళ్లీ దోపిడీ రాజ్యం.
- పోలీసులకు బహిరంగంగా సవాలు..
- మార్కెట్లో కాల్పులు జరిపి రూ.10 కోట్లు డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Firing: ఢిల్లీలో మళ్లీ దోపిడీ రాజ్యం మొదలైంది. ఔటర్ ఢిల్లీలోని నాంగ్లోయ్లోని ఫర్నిచర్ దుకాణం, ఔటర్-నార్త్ ఢిల్లీలోని అలీపూర్లోని ప్రాపర్టీ డీలర్ కార్యాలయంపై కాల్పులు జరిపి ముగ్గురు దుండగులు ఢిల్లీ పోలీసులకు బహిరంగంగా సవాలు విసిరారు. అయితే ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నాంగ్లోయ్ ఘటనలో కాల్పులు జరిపిన ముష్కరులు కరపత్రాన్ని విడిచిపెట్టారు. స్లిప్లో గ్యాంగ్స్టర్ అంకేష్ లక్రా పేరు రాసి రూ.10 కోట్ల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దుండగులను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వరకు నిందితుల ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందాలు దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి.
Also Read: Bus Accident: అదుపు తప్పిన బస్సు.. పోలీస్ కానిస్టేబుల్తో సహా మరో వ్యక్తి మృతి
Also Read
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
ఇకపోతే, ఢిల్లీ పోలీసు అదనపు పోలీసు కమిషనర్ రాజీవ్ రంజన్ ఈ ఘటనను ధృవీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన సమయంలో బాధితుడు తన దుకాణంలో ఉన్నాడు. అప్పుడు ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు అతని దుకాణానికి వచ్చి గాలిలోకి కాల్పులు ప్రారంభించారు. దుండగులు గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరిపి స్కూటర్పై పారిపోయారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్, క్రైమ్ టీమ్ రంగంలోకి దిగింది.
Also Read: Revanth Reddy: బలహీనుడి గళం.. సామాజిక న్యాయ రణం.. రాహుల్ గాంధీకి స్వాగతం..
దుండగులను గుర్తించామని, వారిని అరెస్టు చేయడానికి అనేక బృందాలను నియమించామని పోలీసు అధికారి పేర్కొన్నారు. అయితే ఘటన జరిగిన తీరు చూస్తే ఎవరికైనా ప్రాణహాని ఉండేదని బాధిత దుకాణదారు చెబుతున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని, డబ్బు కోసం మాత్రమే అక్రమార్కులు కాల్పులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఫర్నీచర్ షాపుపై కాల్పులు జరిపిన దుండగులు గ్యాంగ్ స్టర్ అంకేష్ లక్రా పేరు రాసి ఉన్న స్లిప్ ను వదిలేశారు. అందులో వారు 10 కోట్లు డిమాండ్ చేసారు. ఫిర్యాదుదారుడి వాంగ్మూలం ఆధారంగా నిందితులను కూడా గుర్తించారు. త్వరలో అందరినీ అరెస్టు చేస్తామని పొలిసు అధికారులు అన్నారు. అయితే, ఎంత విమోచనం డిమాండ్ చేశారనే దానిపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.
#WATCH | Delhi: Information was received about an incident of firing at a shop in PS Nangloi area. The complainant said that three boys with their faces covered came to the shop, fired several rounds in the air and ran away. A case is being registered. Search for the accused is… pic.twitter.com/iiNwTwaqBm
— ANI (@ANI) November 4, 2024
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!