Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
- 'బాస్ స్కామ్'పై సెబీ హెచ్చరిక
- ఏమిటి 'బాస్ స్కామ్'?
- ఎలా మోసం చేస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి జరుగుతున్న సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (SEBI) లిస్టెడ్ కంపెనీలు, నియంత్రిత సంస్థలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘బాస్ స్కామ్’ (Boss Scam) లేదా CEO/MD ఇంపర్సనేషన్ స్కామ్ పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏమిటి ‘బాస్ స్కామ్’?
ఈ మోసంలో సైబర్ నేరగాళ్లు కంపెనీ CEO, మేనేజింగ్ డైరెక్టర్ (MD) లేదా ఇతర ఉన్నతాధికారుల్లా నటిస్తూ ఉద్యోగులను మోసం చేస్తారు. ఇందుకోసం వారు AI ఆధారిత డీప్ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, మాల్వేర్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఫైనాన్స్ లేదా అకౌంట్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు అత్యవసరంగా నిధులు బదిలీ చేయాలని ఆదేశాలు పంపిస్తారు. ఈ సందేశాలు నిజమైన అధికారుల నుంచి వచ్చినట్లుగా కనిపించేలా రూపొందిస్తారు.
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
ఎలా మోసం చేస్తున్నారు?
సెబీ తెలిపిన వివరాల ప్రకారం, మోసగాళ్లు… ఇమెయిల్, WhatsApp, Microsoft Teams లేదా ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా CEO లేదా MD పేరుతో సంప్రదిస్తారు. “ఇది అత్యంత గోప్యమైన విషయం” అంటూ వెంటనే డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి తెస్తారు. నిజమని నమ్మించేలా నకిలీ సోషల్ మీడియా గ్రూపులను కూడా సృష్టిస్తున్నారు. ZIP ఫైళ్ల రూపంలో మాల్వేర్ పంపించి, వాటిని ఓపెన్ చేయగానే కంప్యూటర్ లేదా మొబైల్ను హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసిన తర్వాత WhatsApp Web సెషన్ను స్వాధీనం చేసుకుని, అసలు ఉద్యోగి ఖాతా నుంచే ఇతరులకు చెల్లింపు సూచనలు పంపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లను కూడా మార్చి, నిజమైన అధికారుల స్థానంలో నకిలీ నంబర్లను చూపించేలా చేస్తున్నారు.
సెబీ సూచనలు
ఈ తరహా మోసాల నుంచి రక్షణ పొందేందుకు సెబీ సంస్థలకు పలు సూచనలు చేసింది. డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా వచ్చిన ఆర్థిక లావాదేవీల సూచనలను వెంటనే అమలు చేయవద్దు. డబ్బు బదిలీ చేసే ముందు సంబంధిత అధికారిని ఫోన్ ద్వారా లేదా ప్రత్యక్షంగా సంప్రదించి నిర్ధారించుకోవాలి. సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్లలో వచ్చిన సూచనల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవద్దు. తెలియని వ్యక్తులు పంపిన ZIP లేదా ఇతర ఎగ్జిక్యూటబుల్ ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదు. కంపెనీల్లో సైబర్ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలి.
సైబర్ మోసం జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి
ఏదైనా సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సెబీ సూచించింది. AI సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇలాంటి మోసాల ప్రమాదం కూడా పెరుగుతోందని, కంపెనీలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!