RCB Stampede: బెంగళూరు తొక్కిసలాట కేసులో మొదటి అరెస్టు.. ఆర్సీబి మార్కెటింగ్ హెడ్ సహా ముగ్గురు అరెస్టు
- బెంగళూరు తొక్కిసలాట కేసులో మొదటి అరెస్టు
- ఆర్సీబి మార్కెటింగ్ హెడ్ సహా ముగ్గురు అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ DNA ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, ఇతరులపై FIR నమోదు చేశారు పోలీసులు. FIRలో నేరపూరిత హత్య వంటి తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు. అదే సమయంలో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అరెస్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మొదటి అరెస్టు జరిగింది. బెంగళూరు విమానాశ్రయంలో ఆర్సిబి మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read:Elon Musk: సెక్స్ స్కామ్ నిందితుడితో ట్రంప్కు సంబంధాలు.. మస్క్ సంచలన ఆరోపణలు
Also Read
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్కే ఛాన్స్!
మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్టరీ పరేడ్ కు సంబంధించి నిఖిల్ సొసలే అనధికారిక ప్రమోషన్స్ చేశారని, అనుమతి లేకుండా పరేడ్ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. డిఎన్ఎ ఈవెంట్ ఆర్గనైజర్ సునీల్ మాథ్యూ కిరణ్ సహా మరోకరిని అరెస్టు చేశారు. వారందరినీ కబ్బన్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఆర్సిబి తన తొలి ఐపిఎల్ టైటిల్ను గెలుచుకున్న వేడుకల్లో పాల్గొనడానికి లక్షలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వెలుపల గుమిగూడారు. ఈ సమయంలో, తొక్కిసలాట చోటుచేసుకోగా 11 మంది మరణించారు. 56 మంది గాయపడ్డారు. ఈ కేసును దర్యాప్తు కోసం సిఐడికి అప్పగించారు.
Also Read:Delhi: ఢిల్లీలో ఎద్దు బీభత్సం.. నిలిచి ఉన్న వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్
పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో ఆర్సిబిని మొదటి నిందితుడిగా, డిఎన్ఎ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ను రెండవ నిందితుడిగా, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీని మూడవ నిందితుడిగా చేర్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన అనుమతి తీసుకోలేదని FIR పేర్కొంది. RCB, DNA ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అవసరమైన అనుమతి లేకుండానే విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. FIR దాఖలు చేసిన తర్వాత చట్టపరమైన చర్యలకు సహకరిస్తామని RCB తెలిపింది.
తాజావార్తలు
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
-
MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
-
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!