Delhi: ఢిల్లీలో ఎద్దు బీభత్సం.. నిలిచి ఉన్న వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్
- ఢిల్లీలో ఎద్దు బీభత్సం
- నిలిచి ఉన్న వ్యక్తిపై దాడి
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. పట్టపగలే మనుషులపైకి తెగబడింది. రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఒక వ్యక్తిపైకి అమాంతంగా దాడి చేసి ఈడ్చుకుపోయింది. దీంతో దానితో పోరాడలేక కిందపడిపోయాడు. అనంతరం దాడి చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: French Open 2025: లేడీ నాదల్ ఔట్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా!
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ఢిల్లీలోని చత్తర్పూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇంతలో ఒక ఎద్దు అతడి దగ్గరకు వచ్చి కొమ్ములతో ఎటాక్ చేసింది. కిందపడేసి కొంత దూరం ఈడ్చుకుని పోయింది. అనంతరం కొమ్ములతో పొడుస్తూనే ఉంది. లేచి వెళ్లేందకు ప్రయత్నించినా అవకాశమే ఇవ్వలేదు. ఇంతలో అతడి అరుపులు విని సమీపంలో ఉన్న మహిళలు బయటకు వచ్చి బెదిరించే ప్రయత్నిస్తే వాళ్లపై కూడా దాడి చేసింది. ఒక మహిళను కొమ్ములతో పొడవడంతో కిందపడిపోయింది. ఆమెకు కూడా గాయాలయ్యాయి. ఇక స్థానికులు అప్రమత్తమై కర్రలు, రాళ్లతో కొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ నుంచి పరారైంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటలో ఏపీకి చెందిన బాలిక మృతి.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు..
ఇక వైరల్ వీడియోపై నెటిజన్లు స్పందించారు. రాజధాని నగర రోడ్లపైకి జంతువులు రానివ్వకుండా చూడాలని.. జంతువులతో మనుషులు ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. వీధికుక్కులైనా.. ఎద్దులైనా మనుషులకు తీవ్రమైన ముప్పుగా మారాయని.. వెంటనే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇంకొకరు డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలోనే ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని ఒక వీధిలో ఇద్దరిపై ఎద్దు దాడి చేయడంతో 67 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు గాయపడ్డారు. ఇటీవల రాజస్థాన్లోని కోటాలో కూడా ఎద్దు దాడి చేయడంతో వృద్ధుడు చనిపోయాడు.
Bull attacks on a Guy who was standing on Road:
https://t.co/9s68f3vwL8— Ghar Ke Kalesh (@gharkekalesh) June 3, 2025
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!