Delhi: ఢిల్లీలో ఎద్దు బీభత్సం.. నిలిచి ఉన్న వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్
- ఢిల్లీలో ఎద్దు బీభత్సం
- నిలిచి ఉన్న వ్యక్తిపై దాడి
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. పట్టపగలే మనుషులపైకి తెగబడింది. రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఒక వ్యక్తిపైకి అమాంతంగా దాడి చేసి ఈడ్చుకుపోయింది. దీంతో దానితో పోరాడలేక కిందపడిపోయాడు. అనంతరం దాడి చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: French Open 2025: లేడీ నాదల్ ఔట్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా!
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని చత్తర్పూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇంతలో ఒక ఎద్దు అతడి దగ్గరకు వచ్చి కొమ్ములతో ఎటాక్ చేసింది. కిందపడేసి కొంత దూరం ఈడ్చుకుని పోయింది. అనంతరం కొమ్ములతో పొడుస్తూనే ఉంది. లేచి వెళ్లేందకు ప్రయత్నించినా అవకాశమే ఇవ్వలేదు. ఇంతలో అతడి అరుపులు విని సమీపంలో ఉన్న మహిళలు బయటకు వచ్చి బెదిరించే ప్రయత్నిస్తే వాళ్లపై కూడా దాడి చేసింది. ఒక మహిళను కొమ్ములతో పొడవడంతో కిందపడిపోయింది. ఆమెకు కూడా గాయాలయ్యాయి. ఇక స్థానికులు అప్రమత్తమై కర్రలు, రాళ్లతో కొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ నుంచి పరారైంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటలో ఏపీకి చెందిన బాలిక మృతి.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు..
ఇక వైరల్ వీడియోపై నెటిజన్లు స్పందించారు. రాజధాని నగర రోడ్లపైకి జంతువులు రానివ్వకుండా చూడాలని.. జంతువులతో మనుషులు ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. వీధికుక్కులైనా.. ఎద్దులైనా మనుషులకు తీవ్రమైన ముప్పుగా మారాయని.. వెంటనే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇంకొకరు డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలోనే ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని ఒక వీధిలో ఇద్దరిపై ఎద్దు దాడి చేయడంతో 67 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు గాయపడ్డారు. ఇటీవల రాజస్థాన్లోని కోటాలో కూడా ఎద్దు దాడి చేయడంతో వృద్ధుడు చనిపోయాడు.
Bull attacks on a Guy who was standing on Road:
https://t.co/9s68f3vwL8— Ghar Ke Kalesh (@gharkekalesh) June 3, 2025
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!