Thopudurthi Prakash Reddy: నువ్ మైసూర్ మహారాణివి ఏం కాదు.. పరిటాల సునీతపై తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు!
- పరిటాల సునీతపై తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు
- నువ్ మైసూర్ మహారాణివి ఏం కాదు సునీతమ్మ
- పరిటాల కుటుంబం ఎక్కడ దానం చేసిందో చెప్పాలి
- దానం చేయడం కాదు రక్తం పిండి వసూల్ చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఏ విషయంలో అయినా ఓ ఎమ్మెల్యేగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని, నువ్ ఏం ఇక్కడ మైసూర్ మహారాణివి కాదు అని మండిపడ్డారు. పోలీసులను అడగడానికి వెళ్లిన ప్రజలపై ఎందుకు కేసులు పెట్టావ్ అని ప్రశ్నించారు. హామీల అమలపై ప్రశ్నించిన జనాలకు చెప్పులు చూపిస్తావా?, ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్ష నేతగా అడిగితే చెప్పు తెగుద్ది అంటావా? అని ఫైర్ అయ్యారు. పరిటాల ట్యాక్స్లతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని తోపుదుర్తి పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ‘ఏపీ ప్రభుత్వ ఇళ్ల నిర్మాణంలో భారీ స్కామ్ జరుగుతోంది. ఒక్కో ఇంటి నిర్మాణంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు పది వేల రూపాయల కమిషన్ వసూలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు దమ్ము-ధైర్యం ఉంటే విచారణ చేయాలి. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు ధర్మవరం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ అవినీతిపరులు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకుంటున్నారు. పరిటాల ట్యాక్స్లతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబానికి వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నాయి. పండగ రోజు 8 కార్లకు, గన్నులకు ఆయుధ పూజ చేశారు. ఇదంతా ప్రజలను దోచుకున్న సొమ్ము కాదా?’ అని తోపుదుర్తి ప్రశ్నించారు.
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
Also Read: Suryakumar Yadav Regret: నా కోరిక ఎప్పటికీ నెరవేరదు.. తీవ్రంగా చింతిస్తుంటా!
‘పరిటాల కుటుంబం దానం చేసే కుటుంబం అని ఎమ్మెల్యే సునీతమ్మ గారు చెప్పుకుంటున్నారు. ఎక్కడ దానం చేశావో చెప్పాలి. మేం ప్రజల కోసం డబ్బులు పెట్టి తీసుకొచ్చిన నీళ్లను అడ్డుకున్నావ్. రైతుల కడుపులు కొట్టావ్. రాప్తాడు నియోజకవర్గంలో మీ టీడీపీ కార్యకర్తలనే చెప్పమను.. పరిటాల కుటుంబం దానం ధర్మం చేస్తాడని. ఓ రైతు మీద నువ్ 50 లక్షలు సంపాదించావ్. మీరు దానం చేయడం కాదు.. రక్తం పిండి వసూల్ చేశారు. ధర్మవరం చేనేత వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు అక్రమంగా వసూళ్లు చేశారు. హామీల అమలపై ప్రశ్నించిన వారికి చెప్పు తెగుద్ది అని ఎమ్మెల్యే పరిటాల సునీత అంటున్నారు. ప్రజలు తిరగబడితే ఎవరి చెప్పులైనా తెగుతాయని సునీత గుర్తించాలి’ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డివార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!