MAY 01 : ప్రభుత్వం కొత్త నిబంధనలు.. ఇవాళ్టి నుంచి మీ జేబుకు చిల్లే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ్టి( మే 1 ) నుంచి చాలా మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతాయి. మే 1 నుంచి ప్రభుత్వం కొన్ని నిబంధనలను మార్చనుంది. GST, CNG-PNG, గ్యాస్ సిలిండర్లు, మ్యూచువల్ ఫండ్స్ తో సహా అనేక నిమయాల్లో మార్పులు ఉంటాయి. బ్యాటరీతో నడిచే వెహికిల్స్ కు సంబంధించిన నిబంధనలలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఈ మార్పులు సామాన్యుల జేబుపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Also Read : Heavy Rains in AP: ఏపీని ముంచెత్తిన వాన.. ఐఎండీ వార్నింగ్
Also Read
CNG ధరలు ప్రతి నెల మొదటి రోజె లేదా మొదటి వారంలో మారుతాయి. పెట్రోలియం కంపెనీలు ప్రతి నెల మొదటి వారంలో గ్యాస్ ధరలను మారుస్తాయి. ఏప్రిల్ లో ఢిల్లీ, ముంబైలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు తగ్గాయి.
ఈ నేపథ్యంలో మే 1న కూడా సీఎన్జీ, పీఎన్జీ ధరల్లో మార్పు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే జీఎస్టీకి సంబంధించిన రూల్స్ లో చాలా మార్పులు తీసుకువచ్చాయి. మారిన ఈ నిబంధనలను ప్రారిశ్రామికవేత్తలు పాటించాలి. ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదును ఏడు రోజుల్లోగా ఇన్ వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో అప్ లోడ్ చేయడం తప్పనిసరి.. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుంది.
Also Read : AdiReddy Apparao: ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లకు మే 12 వరకు రిమాండ్
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలను మార్చింది. దీని ప్రకారం.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించే డిజిటల్ వాలెట్ RBI KYC పొందాలి. ఈ నియమం ఇవాళ ( మే 1,2023 ) నుంచి అమలులోకి వస్తుంది. ఇవాళ్టి నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకుండా లావాదేవీని నిలిపివేస్తే.. రూ. 10+GST జరిమానా విధించబడుతుంది. అలాగే.. ఖాతాలో అవసరమైన బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఏటీఎం లావాదేవీ విఫలమైతే సమస్యను పరిష్కరించడానికి పీఎన్బీ మార్గదర్శకాలను రూపొండించింది. ఏటీఎం లావాదేవీ వైఫల్యం గురించి కస్టమర్ ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదు స్వీకరించిన ఏడు రోజుల్లో బ్యాంక్ సమస్యను పరిష్కరిస్తుంది. 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించడంలో బ్యాంక్ ఫెయిల్ అయితే.. కస్టమర్ కు బ్యాంక్ రూ.100 చెల్లిస్తుంది. వారికి రేటు ప్రకారం పరిహారం చెల్లిస్తామని బ్యాంక్ తెలిపింది. ఇవాళ్టి నుంచి బ్యాటరీతో నడిచే టూరిస్ట్ వాహనాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి లైసెన్స్ రుసుమును వసూలు చేయదని వెల్లడించింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!