DGP Jitender: తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదు- తెలంగాణ డీజీపీ..
- పోలీసు అమరవీరుల దినోత్సవం.. గణపతి నిమజ్జనం.. మీలాద్ ఉన్ నభి విజయవంతంగా పూర్తి
- మీడియా సమావేశం నిర్వహించిన డీజీపీ జితేందర్
- గణేష్ నిమజ్జనం.. మిలాద్ ఉన్ నభి ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశాం- డీజీపీ
- తెలంగాణ మావోయిస్టు ప్రాబల్యం లేదు- డీజీపీ
- ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో స్పెషల్ టీమ్ విచారణ చేస్తున్నాం- డీజీపీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసు అమరవీరుల దినోత్సవం, గణపతి నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నభి ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో 1లక్ష 36, 638 విగ్రహాలు నిమజ్జనం జరిగాయి.. 5879 చోట్ల నిమజ్జన పాయింట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నీ శాఖల సమన్వయంతో కలిసి పనిచేశామని డీజీపీ పేర్కొన్నారు. ట్రైనీ ఎస్సైలు, కానిస్టేబుళ్లు 12వేల మంది సిబ్బంది సైతం పాల్గొన్నారు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది కృషి చేసారన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో మొత్తం 300 ప్రాంతాల్లో యాత్రలు జరిగాయి.. చిన్న చిన్న ఘటనలు మినహా గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా ముగిసాయని చెప్పారు. ప్రజలు, భక్తులు ఎంతో సహకరించారని డీజీపీ అన్నారు. డీజేల ఏర్పాటు, శబ్ద కాలుష్యం కొంత నగర వాసులను ఇబ్బంది పెట్టింది.. డీజేల విషయంలో త్వరలో గైడ్లైన్స్ విడుదల చేస్తామని తెలిపారు.
Read Also: Govt Hospitals: తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత.. ఇబ్బందులు పడుతున్న రోగులు
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
మరోవైపు.. జైనూర్ ఘటన దురదుష్టకరం అని డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ కేసులో 38 మందిని అరెస్ట్ చేశాము.. అక్కడ పరిస్థితులు చేయి దాటి పోవడంతో పలువురిని అరెస్ట్ చేశామన్నారు. అక్కడ అలసత్వం వహించిన డీఎస్పీ పై వేటు వేశామని డీజీపీ పేర్కొ్న్నారు. అలాగే.. సంగారెడ్డి సాంఘిక బహిష్కరణ పైన కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదని చెప్పారు. మావోయిస్టు ప్రాబల్యం కోసం తెలంగాణకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. తెలంగాణ చుట్టుపక్క రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం ఉందని అన్నారు. మావోయిస్టు కట్టడికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో స్పెషల్ టీమ్ విచారణ చేస్తున్నాం.. హైదరాబాద్ సీపీ, వెస్ట్ జోన్ డీసీపీ విచారణ చేస్తున్నారని చెప్పారు. కోర్ట్ పరిధిలో ఉంది కాబట్టి తాను కామెంట్ చేయలేనని అన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి కొంత సమయం పట్టింది.. రెడ్ కార్నర్ నోటీసులు కోసం ఇంటర్ పోల్కి లేఖ రాశామన్నారు. సీబీఐకి రాగానే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యు అవుతుందని డీజీపీ జితేందర్ తెలిపారు.
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..