DGP Jitender: తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదు- తెలంగాణ డీజీపీ..
- పోలీసు అమరవీరుల దినోత్సవం.. గణపతి నిమజ్జనం.. మీలాద్ ఉన్ నభి విజయవంతంగా పూర్తి
- మీడియా సమావేశం నిర్వహించిన డీజీపీ జితేందర్
- గణేష్ నిమజ్జనం.. మిలాద్ ఉన్ నభి ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశాం- డీజీపీ
- తెలంగాణ మావోయిస్టు ప్రాబల్యం లేదు- డీజీపీ
- ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో స్పెషల్ టీమ్ విచారణ చేస్తున్నాం- డీజీపీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసు అమరవీరుల దినోత్సవం, గణపతి నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నభి ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో 1లక్ష 36, 638 విగ్రహాలు నిమజ్జనం జరిగాయి.. 5879 చోట్ల నిమజ్జన పాయింట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నీ శాఖల సమన్వయంతో కలిసి పనిచేశామని డీజీపీ పేర్కొన్నారు. ట్రైనీ ఎస్సైలు, కానిస్టేబుళ్లు 12వేల మంది సిబ్బంది సైతం పాల్గొన్నారు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది కృషి చేసారన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో మొత్తం 300 ప్రాంతాల్లో యాత్రలు జరిగాయి.. చిన్న చిన్న ఘటనలు మినహా గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా ముగిసాయని చెప్పారు. ప్రజలు, భక్తులు ఎంతో సహకరించారని డీజీపీ అన్నారు. డీజేల ఏర్పాటు, శబ్ద కాలుష్యం కొంత నగర వాసులను ఇబ్బంది పెట్టింది.. డీజేల విషయంలో త్వరలో గైడ్లైన్స్ విడుదల చేస్తామని తెలిపారు.
Read Also: Govt Hospitals: తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత.. ఇబ్బందులు పడుతున్న రోగులు
Also Read
- PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
- Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్లకు ఎఫ్డీఏ షోకాజ్ నోటీసులు
- Ashish Banerjee Death: మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి.. పార్టీ ఆఫీస్లో ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం
- 2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ తేదీలో మార్పులు? ఆ రోజే తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు ఇవే..
మరోవైపు.. జైనూర్ ఘటన దురదుష్టకరం అని డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ కేసులో 38 మందిని అరెస్ట్ చేశాము.. అక్కడ పరిస్థితులు చేయి దాటి పోవడంతో పలువురిని అరెస్ట్ చేశామన్నారు. అక్కడ అలసత్వం వహించిన డీఎస్పీ పై వేటు వేశామని డీజీపీ పేర్కొ్న్నారు. అలాగే.. సంగారెడ్డి సాంఘిక బహిష్కరణ పైన కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదని చెప్పారు. మావోయిస్టు ప్రాబల్యం కోసం తెలంగాణకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. తెలంగాణ చుట్టుపక్క రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం ఉందని అన్నారు. మావోయిస్టు కట్టడికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో స్పెషల్ టీమ్ విచారణ చేస్తున్నాం.. హైదరాబాద్ సీపీ, వెస్ట్ జోన్ డీసీపీ విచారణ చేస్తున్నారని చెప్పారు. కోర్ట్ పరిధిలో ఉంది కాబట్టి తాను కామెంట్ చేయలేనని అన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి కొంత సమయం పట్టింది.. రెడ్ కార్నర్ నోటీసులు కోసం ఇంటర్ పోల్కి లేఖ రాశామన్నారు. సీబీఐకి రాగానే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యు అవుతుందని డీజీపీ జితేందర్ తెలిపారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu Season10:’బిగ్ బాస్10′ తెలుగు సీజన్ కు నాగ్ గ్రాండ్ ఎంట్రీ.. 10 సర్ప్రైజ్లతో కొత్త సీజన్, ప్రోమో వైరల్!
-
Sarfaraz Khan: ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు.. అయినా తగ్గేదేలే.. మ్యాచ్ ఆసాంతం సర్ఫరాజ్ ఏం చేశాడంటే!
-
Bollywood : ఒకే ఏడాది 4 సినిమాలు.. 4 విభిన్న జానర్లు.. యంగ్ హీరో ప్లానింగ్ మాములుగా లేదు
-
CAG Railway Report: రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా?.. CAG రిపోర్ట్లో సంచలన విషయాలు
-
Newtons 3rd Law OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీకి సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!