NTV Telugu Site icon

Jeevan Reddy: “కాంగ్రెస్ ని వీడే ప్రసక్తే లేదు”..భట్టి తో భేటీ అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య

New Project (24)

New Project (24)

తాను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని..చేరికల విషయంలో మనస్థాపం చెందానని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నానన్నారు. ఎమ్మెల్సీ గా అసెంబ్లీకి వెళ్ళే హక్కు నాకు ఉందని..నా కార్యకర్తలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు ముగిశాయి. అనంతరం జీవన్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Loksabha: లోక్​సభ స్పీకర్​ ఎన్నికపై ఉత్కంఠ..(వీడియో)

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..”ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు. మా అందరికీ మార్గదర్శకులు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి అనుభవాన్ని ప్రభుత్వ నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటాం.కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పది సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి. ఈ ప్రభుత్వం నడవడం కోసం వారి ఆలోచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియార్టీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సమచిత ప్రాధాన్యమిస్తూ గౌరవిస్తుంది. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మనస్థాపం పడితే మేమందరం బాధపడతాం.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: KCR: తెలంగాణ విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్..

కాగా.. జీవన్ రెడ్డి ఎమ్మె్ల్సీ పదవికి రాజీనామా చేస్తు్న్నట్లు ఇటీవల ప్రకటించారు. తను పార్టీలో గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..”ఎవరి మీద అయితే పదేళ్లు పోరాటం చేశానో నాకు తెలియకుండా వాళ్ళనే పార్టీలో జాయిన్ చేసుకున్నారు. టీవీల్లో పేపర్లో చూసేవరకు నాకు విషయం తెలియదు. పార్టీలో నాకు అవమానం జరిగింది అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్న.” అని ఆయన పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భేటీ అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.