Germany: జర్మనీలో అశోక చక్రవర్తి అవశేషాలు.. పరిశీలించిన భారత విదేశాంగ మంత్రి
- విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జర్మనీ పర్యటన
- వివిధ ద్వైపాక్షిక.. ప్రపంచ సమస్యలపై చర్చ
- జర్మనీలో అశోక చక్రవర్తి అవశేషాలు
- పరిశీలించిన భారత విదేశాంగ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇతర మంత్రులతో వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీ తరపున ఛాన్సలర్ స్కోల్జ్కు వ్యక్తిగత శుభాకాంక్షలు తెలిపారు. అయితే జైశంకర్ పర్యటనకు సంబంధించిన ఓ చిత్రం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం జర్మనీలో భారతదేశ సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. నిజానికి.. జైశంకర్ ఈ పర్యటనలో బెర్లిన్లోని ప్రసిద్ధ హంబోల్ట్ ఫోరమ్కు చేరుకున్నారు. హంబోల్ట్ ఫోరమ్ అనేది మానవ చరిత్ర, కళ, సంస్కృతికి సంబంధించిన వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మ్యూజియం. ఈ హంబోల్ట్ ఫోరమ్ బెర్లిన్ ప్యాలెస్ లోపల ఉంది. ఈ మ్యూజియం కోవిడ్ సమయంలో ప్రారంభించబడింది. ప్రపంచ సంస్కృతిని, కళలను అర్థం చేసుకున్న కళాభిమానులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. కాగా.. ప్రపంచం నలుమూలల్లో భారతీయ చరిత్ర ఉంది.
READ MORE: Uttar Pradesh: కాన్పూర్-ఢిల్లీ హైవేపై నగ్నంగా, తల లేకుండా మహిళ మృతదేహం..
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ఈ హంబోల్ట్ ఫోరమ్లో భారతదేశ చరిత్ర కూడా దాగి ఉంది. ఈ హంబోల్ట్ ఫోరమ్ వెలుపల ఒక ద్వారం ఉంది. ఇది భారతదేశంలోని సాంచి స్థూపం యొక్క తూర్పు ద్వారానికి చెందిన ప్రతిరూపం. విదేశాంగ మంత్రి తన బెర్లిన్ పర్యటన సందర్భంగా సాంచి స్థూపం ద్వారం యొక్క ఈ ప్రతిరూపాన్ని చూసేందుకు వచ్చారు. దీంతో భారతదేశ సుందర వారసత్వాలు ప్రపంచ స్థాయికి చేరుకోవడంపై చర్చ మొదలైంది. భారతదేశంలోని సాంచి స్థూపం మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం.. భోపాల్ నుంచి 46 కి.మీ దూరంలో ఉంది. ఇది దేశంలోని బౌద్ధమతం యొక్క గొప్ప చరిత్ర, నాగరికతకు చిహ్నం. ఇది మూడవ శతాబ్దం క్రితం గొప్ప భారతీయ చక్రవర్తి అశోకుడి కాలంలో నిర్మించబడింది. అయితే.. తరువాత పాలకులు దీనిని ధ్వంసం చేయగా.. మళ్లీ పునరుద్ధరించారు. దాదాపు 2700 ఏళ్ల తర్వాత కూడా అశోకుని సందేశాలను ప్రపంచం గుర్తు చేసుకుంటోంది. బెర్లిన్లోని హంబోల్ట్ ఫోరమ్లో సాంచి స్థూపం యొక్క తూర్పు ద్వారంతో విదేశాంగ మంత్రి మరోసారి ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు. ఈ సందేశం కూడా చాలా ముఖ్యమైనది.. ఎందుకంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమైనా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధమైనా… ప్రతిరోజూ వందలాది మంది చనిపోతున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!