Germany: జర్మనీలో అశోక చక్రవర్తి అవశేషాలు.. పరిశీలించిన భారత విదేశాంగ మంత్రి
- విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జర్మనీ పర్యటన
- వివిధ ద్వైపాక్షిక.. ప్రపంచ సమస్యలపై చర్చ
- జర్మనీలో అశోక చక్రవర్తి అవశేషాలు
- పరిశీలించిన భారత విదేశాంగ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇతర మంత్రులతో వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీ తరపున ఛాన్సలర్ స్కోల్జ్కు వ్యక్తిగత శుభాకాంక్షలు తెలిపారు. అయితే జైశంకర్ పర్యటనకు సంబంధించిన ఓ చిత్రం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం జర్మనీలో భారతదేశ సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. నిజానికి.. జైశంకర్ ఈ పర్యటనలో బెర్లిన్లోని ప్రసిద్ధ హంబోల్ట్ ఫోరమ్కు చేరుకున్నారు. హంబోల్ట్ ఫోరమ్ అనేది మానవ చరిత్ర, కళ, సంస్కృతికి సంబంధించిన వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మ్యూజియం. ఈ హంబోల్ట్ ఫోరమ్ బెర్లిన్ ప్యాలెస్ లోపల ఉంది. ఈ మ్యూజియం కోవిడ్ సమయంలో ప్రారంభించబడింది. ప్రపంచ సంస్కృతిని, కళలను అర్థం చేసుకున్న కళాభిమానులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. కాగా.. ప్రపంచం నలుమూలల్లో భారతీయ చరిత్ర ఉంది.
READ MORE: Uttar Pradesh: కాన్పూర్-ఢిల్లీ హైవేపై నగ్నంగా, తల లేకుండా మహిళ మృతదేహం..
Also Read
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
ఈ హంబోల్ట్ ఫోరమ్లో భారతదేశ చరిత్ర కూడా దాగి ఉంది. ఈ హంబోల్ట్ ఫోరమ్ వెలుపల ఒక ద్వారం ఉంది. ఇది భారతదేశంలోని సాంచి స్థూపం యొక్క తూర్పు ద్వారానికి చెందిన ప్రతిరూపం. విదేశాంగ మంత్రి తన బెర్లిన్ పర్యటన సందర్భంగా సాంచి స్థూపం ద్వారం యొక్క ఈ ప్రతిరూపాన్ని చూసేందుకు వచ్చారు. దీంతో భారతదేశ సుందర వారసత్వాలు ప్రపంచ స్థాయికి చేరుకోవడంపై చర్చ మొదలైంది. భారతదేశంలోని సాంచి స్థూపం మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం.. భోపాల్ నుంచి 46 కి.మీ దూరంలో ఉంది. ఇది దేశంలోని బౌద్ధమతం యొక్క గొప్ప చరిత్ర, నాగరికతకు చిహ్నం. ఇది మూడవ శతాబ్దం క్రితం గొప్ప భారతీయ చక్రవర్తి అశోకుడి కాలంలో నిర్మించబడింది. అయితే.. తరువాత పాలకులు దీనిని ధ్వంసం చేయగా.. మళ్లీ పునరుద్ధరించారు. దాదాపు 2700 ఏళ్ల తర్వాత కూడా అశోకుని సందేశాలను ప్రపంచం గుర్తు చేసుకుంటోంది. బెర్లిన్లోని హంబోల్ట్ ఫోరమ్లో సాంచి స్థూపం యొక్క తూర్పు ద్వారంతో విదేశాంగ మంత్రి మరోసారి ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు. ఈ సందేశం కూడా చాలా ముఖ్యమైనది.. ఎందుకంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమైనా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధమైనా… ప్రతిరోజూ వందలాది మంది చనిపోతున్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!