Robbery : సినీఫక్కీలో 4లక్షలు కాజేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తు లను అటకాయించి గొడవకు దిగడంతో పాటు సినీ ఫక్కీలో వారి దృష్టి మరల్చి డబ్బులు తస్కరిస్తున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.. జూబ్లీహిల్స్కు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి గౌతమ్ యాదవ్(32) అనే వ్యక్తితో పాటు పని చేస్తున్న యువతి సబ్జా కాలనీలో నివాసం ఉంటుంది. గత నెల 31న రాత్రి 9.30 ప్రాంతంలో ఆమెతో పాటు కారులో తోడుగా వెళ్లిన గౌతమ్ ఆమె ఇంటివద్ద కారు దిగి తన స్నేహితుడి బైక్పై ఇంటికి బయలుదేరాడు. కొంతదూరం రాగానే రోడ్డుపై కాపుకాసిన హకీంషా, సమీపంలో నివాసం ఉండే అఫ్రోజాన్(24) అనే ఆటో డ్రైవర్, మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇబ్రహీం ఖలీలుల్లా(20), పారామౌంట్ కాల నీలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అహ్మదాబాన్(21)లు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎందుకు యువతితో కలిసి వచ్చావంటూ ప్రశ్నించాడు. ఒంటరిగా వస్తున్న స్నేహితురాలిని ఇంటివద్దకు దింపేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది..
Also Read : Pan India: టైగర్ వైస్ డైనోసర్… ఇండియన్ బాక్సాఫీస్ తగలబడి పోవడం గ్యారెంటీ
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
అతడి చేతిలో ఓ బ్యాగ్ ఉండటంతో దాన్ని కాజేయాలని నిర్ణయించుకున్న ముగ్గురు నిందితులు బైక్పై అతడిని వెంబడించారు. సుమారు కిలోమీటర్ తర్వాత అంబేద్కర్ నగర్ ప్రాంతానికి రాగానే బైకులతో గౌతమ్ యాదవ్ను అడ్డగించారు. గట్టిగా కేకలు వేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన అఫ్రోజ్, ఇబ్రహీం, అహ్మద్ ఖాన్లు అక్కడున్న జనాన్ని పోగు చేశారు. దీంతో గంద రగోళం నెలకొంది. దీంతో తన చేతిలో రూ. 4లక్షల నగ దుతో ఉన్న బ్యాగును నిందితులు మాయం చేశారు…
Also Read : Pan India: టైగర్ వైస్ డైనోసర్… ఇండియన్ బాక్సాఫీస్ తగలబడి పోవడం గ్యారెంటీ
ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపు లోకి తీసుకుని ప్రశ్నించగా దృష్టి మరల్చి డబ్బులు తస్కరించినట్లు అంగీకరించారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్పై గతంలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం, చైన్స్నాచింగ్స్, మొబైల్ స్నాచింగ్స్ తదితర 10 కేసులు ఉన్నాయి. అహ్మద్ ఖాన్పై హత్యకేసు ఉన్నట్లు తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన ఫిలింనగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ.2.40లక్షల నగదుతో పాటు 3 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా చోరీ చేసిన డబ్బుల్లో కొంత ఖర్చు చేశారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!