Suicide: ఆ వ్యాధితో బాధ పడుతూ.. భరించలేక గన్తో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య
- ఉత్తర్ ప్రదేశ్లోని పాటియాలీ కొత్వాలి ప్రాంతంలో విషాదం
- గన్తో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు
- మానసిక ఒత్తిడికి గురై సూసైడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్లోని పాటియాలీ కొత్వాలి ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తండ్రి లైసెన్స్డ్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తుపాకీ పేలిన శబ్ధం విని కుటుంబ సభ్యులు నిద్ర లేచారు. వెంటనే వారు యువకుడి గది వద్దకు వెళ్లి తలుపు తెరిచే సరికి.. లోపల గడియ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో.. తలుపులు పగులగొట్టి చూడగా యువకుడి మృతదేహం రక్తంతో తడిసి పడి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Read Also: Train Incident: కదులుతున్న రైలుపై రాళ్లు రువ్విన వ్యక్తి.. దెబ్బకి ప్రయాణికుడి ముక్కు.?
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
వివరాల్లోకి వెళ్తే.. కస్బా భర్గైన్లోని మొహల్లా హసన్ థోక్లో నివసిస్తున్న షంసుల్ హసన్ కుమారుడు 18 ఏళ్ల మహ్మద్ హుస్సేన్ ఖాన్ ఆదివారం రాత్రి తన గదిలో నిద్రపోయాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తన గదిలో నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడంతో కుటుంబ సభ్యులు నిద్ర లేచారు. కుటుంబ సభ్యులు వెంటనే అతని గది వైపు పరిగెత్తి తలుపు తెరవడానికి ప్రయత్నించారు. కానీ అది లోపల నుండి లాక్ చేయబడింది.
Read Also: Anand Mahindra : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా ఆనంద్ మహీంద్రా
కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. మహ్మద్ హుస్సేన్ మృతదేహం రక్తంతో తడిసి పడి ఉంది. తండ్రి లైసెన్స్ తుపాకీ అతని దగ్గర కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తుపాకీని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే.. మహ్మద్ హుస్సేన్.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడికి లోనై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!