Ongole YSRCP: మేమంతా ఒక్కటే.. ఒంగోలులోని అన్ని స్థానాల్లో విజయం మాదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ongole YSRCP: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరం కలిసికట్టుగా సాగుదామని నిర్ణయించారు.. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల నేతలు.. గత కొన్ని రోజులుగా ఒంగోలు వైసీపీ రాజకీయాలపై చర్చ హాట్ హాట్గా సాగుతోంది.. ఆ అభ్యర్థిని ఖరారు చేశారు.. కానీ, స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. అలిగారని.. ఇంచార్జ్లను మార్చే అవకాశం ఉందనే రకరకాల చర్చలు సాగుతూ వస్తున్న తరుణంలో.. వాటికి ఫులిస్టాప్ పెట్టేశారు వైసీపీ నేతలు.. విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ రీజినల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జిలు తాటిపర్తి చంద్రశేఖర్, దద్దాల నారాయణలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
Read Also: Jyotiraditya Scindia: చిర్రగోనె ఆడిన కేంద్రమంత్రి.. వీడియో వైరల్
Also Read
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఇక, అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ భారీ విజయం సాధించేలా కృషి చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను సంసిద్ధం చేయాలని, ఎన్నికల ముందుకు ఎలా పనిచేయాలి, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అందరూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ సమావేశం పార్టీ కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపినట్లయింది. మేమంతా ఒక్కటే అన్న సంకేతాన్ని ఇవ్వగలిగింది. మొత్తంగా గత కొంత కాలంగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని వైసీపీ నేతలపై రకరాల ప్రచారాలు సాగుతూ రాగా.. ఈ రోజు విజయవాడలో జరిగిన సమావేశంతో వాటికి తెరపడినట్టు అయ్యింది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు నేతలు.
తాజావార్తలు
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి