WHO: వండిన వెంటనే ఆహారం తినడం లేదా.. ప్రమాదంలో పడ్డట్టే
- వండిన ఆహారాన్ని వెంటనే తింటే ఆరోగ్యంగా ఉంటారు- WHO
- ఆలస్యంగా తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు- WHO
- ఆలస్యంగా తినడం వల్ల ఆహారంలో ఉండే ఆరోగ్య విలువలు తగ్గుతాయి- WHO
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వండిన ఆహారాన్ని వెంటనే తింటే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు వండిన ఆహారం తినడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. అయితే.. వండిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఆహారం తినడం ఆరోగ్యకరమైనది కాదని మీకు తెలుసా. దీని వల్ల అనారోగ్యానికి గురవుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
Public Toilet: ఇదేంటి భయ్యా.. పబ్లిక్ టాయిలెట్ బయట టైమర్స్.. అసలేమీ జరుగుతుంది..
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
డబ్ల్యూహెచ్ఓ (WHO) నివేదిక ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రజలు కలుషిత ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. దీని వల్ల దాదాపు 4 లక్షల 20 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కలుషిత ఆహారం తినడం వల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతూ తమ జీవితాలను చాలా సంవత్సరాలు వృధా చేసుకుంటారు. తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా ఇటువంటి పరిస్థితులకు ఎక్కువగా కారణమవుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ ఒక సూచన చేసింది. ఆహారాన్ని తయారు చేయడం, తినడం గురించి కొన్ని సాధారణ మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా ఆహారం వల్ల కలిగే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ మార్గదర్శకాలలో మొదటి ఏమిటంటే.. వంట చేసిన వెంటనే ఆహారం తినాలి.
CM Chandrababu: రేపు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్న సీఎం చంద్రబాబు
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. వంట చేసిన వెంటనే ఆహారం తినాలి.. ఆలస్యం చేయకూడదు. వంట వండే సమయంలో ఆహారంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా దాదాపు నాశనం అవుతుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు వండిన ఆహారాన్ని 5 ° C నుండి 60 ° C వరకు చల్లబరచినట్లయితే, బ్యాక్టీరియా మళ్లీ దానిలో వృద్ధి చెందుతుంది. దీంతో ఆహారం ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ అని చెప్పింది. అంతేకాకుండా.. ఆలస్యంగా తినడం వల్ల ఆహారంలో ఉండే ఆరోగ్య విలువలు తగ్గుతాయి. అంతేకాకుండా.. రుచి కూడా తగ్గుతుంది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!