Madhura: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదం..నేడు హైకోర్టు తీర్పు
- మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదం
- అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం పిటిషన్
- హిందూ పక్షం పిటిషన్లను కొట్టివేయాలని ముస్లిం పక్షం వాదన
- వివాదంపై నేడు తీర్పు వెలువరించనున్న అలహాబాద్ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. షాహి ఈద్గా మసీదు భూమి హిందువులదేనని, అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొంది. అదే సమయంలో, ముస్లిం పక్షం ప్రార్థనా స్థలాల చట్టం, వక్ఫ్ చట్టం, పరిమితి చట్టం, నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టాలను ఉదహరించి, హిందూ పక్షం పిటిషన్లను కొట్టివేయాలని ముస్లిం పక్షం వాదించింది.
READ MORE: Prabhas: కల్కి OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో దాఖలైన 18 పిటిషన్లను కలిపి విచారించాలా వద్దా అనేది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు నిర్ణయించనుంది. హైకోర్టులోని న్యాయమూర్తి జస్టిస్ మయాంక్ కుమార్ జైన్తో కూడిన సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించనుంది. అంతకుముందు.. జూన్ 6న విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. హిందూ పక్షం నుంచి 18 పిటిషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో, ముస్లిం పక్షం ఆర్డర్.. 7, రూల్ 11 ప్రకారం ఈ పిటిషన్ల నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తింది. వాటిని కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. హిందూ, ముస్లిం వర్గాలకు ఈరోజు కీలకం కానుంది.
READ MORE:Collectors Conference: 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వీటిపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు..
హిందూ పార్టీల వాదనలు…
రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈద్గా మొత్తం శ్రీకృష్ణుడి పవిత్ర క్షేత్రం.
షాహీ ఈద్గా మసీదు కమిటీ వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి రికార్డు లేదు.
షాహి ఈద్గా మసీదు శ్రీ కృష్ణ ఆలయాన్ని కూల్చివేసి నిర్మించబడింది.
యాజమాన్య హక్కులు లేకుండా, ఎలాంటి చట్టపరమైన ప్రక్రియ లేకుండా వక్ఫ్ బోర్డు ఈ భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది.
READ MORE: SC Classification: ఎస్సీ వర్గీకణ అంటే ఏంటి?..మూడు దశాబ్ధాలుగా మంద కృష్ణ పోరాటం ఎందుకు..?
ముస్లిం పార్టీల వాదనలు
1968లో ఈ భూమిపై ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని ముస్లిం పార్టీలు వాదిస్తున్నాయి.
60 ఏళ్ల తర్వాత ఒప్పందాన్ని తప్పు అనడం సరికాదు. అందువల్ల కేసు నిర్వహణ సాధ్యం కాదు.
ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం కూడా కేసు నిర్వహించబడదు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!