Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు తీర్పు..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
- మార్చి 10న ఫోన్ టాపింగ్ కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు
- ఇప్పటి వరకు నలుగురు అరెస్ట్
- ఇరువురి బెయిల్ పిటిషన్ల పై వాదనలు పూర్తి
- రేపు తీర్పు ప్రకటించనున్న నాంపల్లి కోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు నాంపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించిన విషయం బయటపడిన సంగతి తెలిసిందే.. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నారు తిరుపతన్న. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు పది మంది కానిస్టేబులు, పది మంది హెడ్ కానిస్టేబుల్స్తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజు 40 మంది సెల్ ఫోన్లను టాపింగ్ చేశారు. మూడు ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా తిరుపతన్న పని చేశారు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లను తిరుపతన్న టీం ట్యాపింగ్ చేశారు. ఈ క్రమంలో.. మూడు సిస్టమ్స్ తో పాటు తొమ్మిది లాగర్స్ ని ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో తేలింది.
Read Also: AP EAPCET: ఈఏపీసెట్-2024 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్తో మీ రిజల్ట్స్ తెలుసుకోండి
Also Read
- KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
- Viral: బిగ్ షాకింగ్... స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
- West Bengal elections: బెంగాల్లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
ఈ క్రమంలో.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మార్చి 10న ఫోన్ టాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులుగా ఆరుగురిని చేర్చారు. కాగా.. ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ లు దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్టు నిందితుల తరుపు వాదనలు చేశారు. ఈ కేసులో సాక్షాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉంది కాబట్టి.. బెయిల్ మంజూరు చేయొద్దని పీపీ తెలిపారు. కాగా.. ఇరువురి బెయిల్ పిటిషన్ల పై వాదనలు పూర్తి అయ్యాయి. దీంతో.. రేపు నాంపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది.
తాజావార్తలు
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
-
Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
-
Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
-
Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!