ఢిల్లీలో మరికాసేపట్లో బీజేపీ సమావేశం కానుంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో.. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్దులు. ఖరారు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. ఏపీలో స్థానాలు, అభ్యర్ధుల ఖరారు పై సుదీర్ఘంగా బీజేపీ నేతల మధ్య చర్చోపచర్చలు సాగాయి.
Read Also: Janasena: పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయింపు..
బీజేపీ పోటీ చేసే 6 లోక్ సభ స్థానాలు: విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, తిరుపతి, నరసాపురం. అంతేకాకుండా.. రాజంపేట లోక్ సభ స్థానం కూడా ఇవ్వాలని బీజేపీ కోరుతుంది. అయితే.. విజయనగరం కాకుండా రాజంపేట ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతుంది. కాగా.. ఈరోజు జరిగే సమావేశంలో అంతిమ నిర్ణయం తీసుకోనుంది బీజేపీ.
Read Also: S Jaishankar: ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదు.. పాక్పై విదేశాంగ మంత్రి మండిపాటు
బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలు: ఎచ్చర్ల, అనపర్తి, విజయవాడ-వెస్ట్, బద్వేల్, ఆదోని, పాడేరు, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్-నార్త్ లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే.. ఈరోజు జరగబోయే సమావేశంలో ఏపీలో బీజేపీ పోటీచేయబోయే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులను ప్రకటించనుంది.