NASA: నాసాపై కేసు వేసిన ఫ్లోరిడా నివాసి..ఎందుకో తెలిస్తే పరేషాన్ కావాల్సిందే..
- నేపుల్స్లోని అలెండ్రో ఒటెరో ఇంటిపై పడిన అంతరిక్ష శిథిలాలు
- ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
- శిథిలం తమ అంతరిక్ష కేంద్రం నుంచి పడిపోయిందని వెల్లడించిన నాసా
- రూ. 67 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నాసాపై కేసు వేసిన ఒటెరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. అంతరిక్ష విజ్ఞాన రంగంలో ప్రజలు ఈ ఏజెన్సీ పేరును ఎంతో గౌరవంగా తీసుకుంటారు. అయితే.. ఇప్పుడు నాసాకి ఓ వ్యక్తి పెద్ద షాక్ ఇచ్చాడు. అతను అంతరిక్ష సంస్థపై కేసుపెట్టాడు.ఈ వ్యక్తి అమెరికాలోని ఫ్లోరిడాలోని నేపుల్స్ నివాసి. 80,000 డాలర్లు అంటే దాదాపు రూ. 67 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని నాసా నుంచి డిమాండ్ చేశాడు.
READ MORE: Nara Brahmani : నువ్వేంటో తెలియజేశావు.. లోకేష్పై బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్
Also Read
అసలేం జరిగిందంటే..నేపుల్స్లోని అలెండ్రో ఒటెరో ఇంటిపై అంతరిక్షం నుంచి శిథిలాలు పడ్డాయి. ఈ శిథిలాలు అతని ఇంటి పైకప్పు నుంచి నేల వరకు రంధ్రం చేసాయి. ఈ సంఘటన జరిగినప్పుడు అలెండ్రో ఒటెరో ఇంట్లో లేడు. తన కుటుంబంతో సెలవులో బయటకు వెళ్లాడు. ఇంట్లో అతని కుమారుడు డేనియల్ మాత్రమే ఉన్నాడు. జరిగిన విషయాన్ని కొడుకు డేనియల్ తండ్రికి ఫోన్ చేసి తెలిపాడు. ఓటెరా స్థానిక టీవీ ఛానెల్తో మాట్లాడుతూ.. ‘ఇది విన్న తర్వాత నేను వణికిపోయాను. నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. ఇంత బలంతో మా ఇంటి మీద పడటంతో బాగా నష్టం వాటిల్లింది.” అని పేర్కొన్నాడు.ఈ సంఘటన మార్చి 8 న జరిగింది.
READ MORE: TG Inter Supply Results: విడుదలైన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
అలెజాండ్రో ఇంటికి చేరుకున్న అనంతరం 4×1.6 అంగుళాల సిలిండర్ను చూశాడు. దాని బరువు సుమారు 1.6 పౌండ్లు అంటే దాదాపు 700 గ్రాములు. తన ఇంటిని ధ్వంసం చేసిన ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందని అతడు ఆలోచించాడు. కాగా.. ఈ సిలిండర్ తన అంతరిక్ష కేంద్రం నుంచి పడిపోయిందని నాసా (NASA) ధృవీకరించింది. కార్గో ప్యాలెట్లపై పాత బ్యాటరీలను అమర్చడానికి దీనిని ఉపయోగించారని తెలిపింది. దీనిని 2021 అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారని.. ఆ వస్తువు భూమి వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే పూర్తిగా కాలిపోతుందని నాసా వెల్లడించింది. దానిలోని ఒక భాగం దాదాపు 3 సంవత్సరాలు అంతరిక్షంలో కొట్టుమిట్టాడిన తర్వాత ఓటెరో ఇంటిపై పడిందని తెలిపింది.
READ MORE: Big Breaking: బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్..!
ఒటైరో నాసాపై కోర్టులో కేసు వెశాడు. అతడి తరఫు న్యాయవాది మికా న్గుయెన్ వర్తీ మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన వారి జీవితాలపై చూపిన ఒత్తిడి, ప్రభావానికి తగిన పరిహారం ఇవ్వాలి. ఘటనలో ఎవరికీ శారీరక గాయాలు కాలేదు. అయితే అలాంటి పరిస్థితి విపత్తుగా మారింది. శిథిలాలు ఇతర దిశలో కొన్ని అడుగుల పడిపోయి ఉంటే, తీవ్రమైన గాయం లేదా మరణం సంభవించవచ్చు.” అని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
-
Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!