2000rs Notes: ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు.. రూ.7117 కోట్ల విలువ..
- ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు..
- రూ.7117 కోట్ల విలువ చేసే సొమ్ము.
2000rs Notes: దేశంలో 2000 రూపాయల నోట్లను నిషేధించి ఒకటిన్నర సంవత్సరాలకు పైగా గడిచినా, ప్రజలు ఇప్పటికీ 7000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఈ కరెన్సీ నోట్లను కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ మొదటి తేదీన ఈ కరెన్సీ నోట్లకు సంబంధించి పెద్ద అప్డేట్ ఇచ్చింది. చెలామణి నుండి తీసివేసినప్పటి నుండి, మొత్తం 2000 రూపాయల నోట్లలో 98 శాతం తిరిగి వచ్చాయని తెలిపింది.
IPL 2025: అన్క్యాప్డ్ ప్లేయర్గా ఎంఎస్ ధోనీ రిటైన్.. సీఎస్కే సీఈవో ఏమన్నాడంటే?
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
2024 అక్టోబరు 1 మంగళవారం నాడు సెంట్రల్ బ్యాంక్ RBI చెలామణి నుండి తీసివేసిన రూ. 2000 నోట్ల రిటర్న్ డేటాను పంచుకుంటూ.. ఈ విలువ కలిగిన నోట్లలో 98 శాతం 2000 రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని తెలిపింది. అయితే ప్రజలు ఇప్పటికీ రూ.7,117 కోట్ల విలువైన నోట్లను ప్రజలు కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ నోట్లను చెలామణి నుండి తీసివేసిన తర్వాత మొదట అవి వేగంగా తిరిగి వచ్చాయని., కానీ ఇప్పుడు అవి చాలా నెమ్మదిగా వస్తున్నాయని తెలిపింది.
Pune Helicopter Crash: హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు మృతి..
క్లీన్ నోట్ పాలసీ కింద 19 మే 2023న దేశంలో చెలామణిలో ఉన్న ఈ అత్యధిక విలువ గల రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించింది. దీని తర్వాత స్థానిక బ్యాంకులు, 19 RBI ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ నోట్లను తిరిగి మార్పిడి చేసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ 23 మే నుండి 30 సెప్టెంబర్ 2023 వరకు సమయం ఇచ్చింది. అయితే, దీని తర్వాత ఈ గడువు నిరంతరంగా పొడిగించబడుతూనే ఉంది. అయితే., ఈ నోట్లను ఇప్పటికీ మార్చుకోవచ్చు. కాకపోతే ఇది స్థానిక బ్యాంకుల్లో సాధ్యం కాదు. చెలామణిలో లేని ఈ నోట్లను అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా వంటి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేస్తామని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్న, తిరువనంతపురం వెళ్లడమే కాకుండా.. ప్రజలు తమకు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు ద్వారా కూడా ఈ నోట్లను డిపాజిట్ చేయవచ్చు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!