2000rs Notes: ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు.. రూ.7117 కోట్ల విలువ..
- ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు..
- రూ.7117 కోట్ల విలువ చేసే సొమ్ము.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2000rs Notes: దేశంలో 2000 రూపాయల నోట్లను నిషేధించి ఒకటిన్నర సంవత్సరాలకు పైగా గడిచినా, ప్రజలు ఇప్పటికీ 7000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఈ కరెన్సీ నోట్లను కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ మొదటి తేదీన ఈ కరెన్సీ నోట్లకు సంబంధించి పెద్ద అప్డేట్ ఇచ్చింది. చెలామణి నుండి తీసివేసినప్పటి నుండి, మొత్తం 2000 రూపాయల నోట్లలో 98 శాతం తిరిగి వచ్చాయని తెలిపింది.
IPL 2025: అన్క్యాప్డ్ ప్లేయర్గా ఎంఎస్ ధోనీ రిటైన్.. సీఎస్కే సీఈవో ఏమన్నాడంటే?
Also Read
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
2024 అక్టోబరు 1 మంగళవారం నాడు సెంట్రల్ బ్యాంక్ RBI చెలామణి నుండి తీసివేసిన రూ. 2000 నోట్ల రిటర్న్ డేటాను పంచుకుంటూ.. ఈ విలువ కలిగిన నోట్లలో 98 శాతం 2000 రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని తెలిపింది. అయితే ప్రజలు ఇప్పటికీ రూ.7,117 కోట్ల విలువైన నోట్లను ప్రజలు కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ నోట్లను చెలామణి నుండి తీసివేసిన తర్వాత మొదట అవి వేగంగా తిరిగి వచ్చాయని., కానీ ఇప్పుడు అవి చాలా నెమ్మదిగా వస్తున్నాయని తెలిపింది.
Pune Helicopter Crash: హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు మృతి..
క్లీన్ నోట్ పాలసీ కింద 19 మే 2023న దేశంలో చెలామణిలో ఉన్న ఈ అత్యధిక విలువ గల రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించింది. దీని తర్వాత స్థానిక బ్యాంకులు, 19 RBI ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ నోట్లను తిరిగి మార్పిడి చేసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ 23 మే నుండి 30 సెప్టెంబర్ 2023 వరకు సమయం ఇచ్చింది. అయితే, దీని తర్వాత ఈ గడువు నిరంతరంగా పొడిగించబడుతూనే ఉంది. అయితే., ఈ నోట్లను ఇప్పటికీ మార్చుకోవచ్చు. కాకపోతే ఇది స్థానిక బ్యాంకుల్లో సాధ్యం కాదు. చెలామణిలో లేని ఈ నోట్లను అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా వంటి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేస్తామని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్న, తిరువనంతపురం వెళ్లడమే కాకుండా.. ప్రజలు తమకు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు ద్వారా కూడా ఈ నోట్లను డిపాజిట్ చేయవచ్చు.
తాజావార్తలు
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!