2000rs Notes: ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు.. రూ.7117 కోట్ల విలువ..
- ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు..
- రూ.7117 కోట్ల విలువ చేసే సొమ్ము.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2000rs Notes: దేశంలో 2000 రూపాయల నోట్లను నిషేధించి ఒకటిన్నర సంవత్సరాలకు పైగా గడిచినా, ప్రజలు ఇప్పటికీ 7000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఈ కరెన్సీ నోట్లను కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ మొదటి తేదీన ఈ కరెన్సీ నోట్లకు సంబంధించి పెద్ద అప్డేట్ ఇచ్చింది. చెలామణి నుండి తీసివేసినప్పటి నుండి, మొత్తం 2000 రూపాయల నోట్లలో 98 శాతం తిరిగి వచ్చాయని తెలిపింది.
IPL 2025: అన్క్యాప్డ్ ప్లేయర్గా ఎంఎస్ ధోనీ రిటైన్.. సీఎస్కే సీఈవో ఏమన్నాడంటే?
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
2024 అక్టోబరు 1 మంగళవారం నాడు సెంట్రల్ బ్యాంక్ RBI చెలామణి నుండి తీసివేసిన రూ. 2000 నోట్ల రిటర్న్ డేటాను పంచుకుంటూ.. ఈ విలువ కలిగిన నోట్లలో 98 శాతం 2000 రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని తెలిపింది. అయితే ప్రజలు ఇప్పటికీ రూ.7,117 కోట్ల విలువైన నోట్లను ప్రజలు కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ నోట్లను చెలామణి నుండి తీసివేసిన తర్వాత మొదట అవి వేగంగా తిరిగి వచ్చాయని., కానీ ఇప్పుడు అవి చాలా నెమ్మదిగా వస్తున్నాయని తెలిపింది.
Pune Helicopter Crash: హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు మృతి..
క్లీన్ నోట్ పాలసీ కింద 19 మే 2023న దేశంలో చెలామణిలో ఉన్న ఈ అత్యధిక విలువ గల రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించింది. దీని తర్వాత స్థానిక బ్యాంకులు, 19 RBI ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ నోట్లను తిరిగి మార్పిడి చేసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ 23 మే నుండి 30 సెప్టెంబర్ 2023 వరకు సమయం ఇచ్చింది. అయితే, దీని తర్వాత ఈ గడువు నిరంతరంగా పొడిగించబడుతూనే ఉంది. అయితే., ఈ నోట్లను ఇప్పటికీ మార్చుకోవచ్చు. కాకపోతే ఇది స్థానిక బ్యాంకుల్లో సాధ్యం కాదు. చెలామణిలో లేని ఈ నోట్లను అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా వంటి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేస్తామని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్న, తిరువనంతపురం వెళ్లడమే కాకుండా.. ప్రజలు తమకు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు ద్వారా కూడా ఈ నోట్లను డిపాజిట్ చేయవచ్చు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!