2000rs Notes: ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు.. రూ.7117 కోట్ల విలువ..
- ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు..
- రూ.7117 కోట్ల విలువ చేసే సొమ్ము.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2000rs Notes: దేశంలో 2000 రూపాయల నోట్లను నిషేధించి ఒకటిన్నర సంవత్సరాలకు పైగా గడిచినా, ప్రజలు ఇప్పటికీ 7000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఈ కరెన్సీ నోట్లను కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ మొదటి తేదీన ఈ కరెన్సీ నోట్లకు సంబంధించి పెద్ద అప్డేట్ ఇచ్చింది. చెలామణి నుండి తీసివేసినప్పటి నుండి, మొత్తం 2000 రూపాయల నోట్లలో 98 శాతం తిరిగి వచ్చాయని తెలిపింది.
IPL 2025: అన్క్యాప్డ్ ప్లేయర్గా ఎంఎస్ ధోనీ రిటైన్.. సీఎస్కే సీఈవో ఏమన్నాడంటే?
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
2024 అక్టోబరు 1 మంగళవారం నాడు సెంట్రల్ బ్యాంక్ RBI చెలామణి నుండి తీసివేసిన రూ. 2000 నోట్ల రిటర్న్ డేటాను పంచుకుంటూ.. ఈ విలువ కలిగిన నోట్లలో 98 శాతం 2000 రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని తెలిపింది. అయితే ప్రజలు ఇప్పటికీ రూ.7,117 కోట్ల విలువైన నోట్లను ప్రజలు కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ నోట్లను చెలామణి నుండి తీసివేసిన తర్వాత మొదట అవి వేగంగా తిరిగి వచ్చాయని., కానీ ఇప్పుడు అవి చాలా నెమ్మదిగా వస్తున్నాయని తెలిపింది.
Pune Helicopter Crash: హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు మృతి..
క్లీన్ నోట్ పాలసీ కింద 19 మే 2023న దేశంలో చెలామణిలో ఉన్న ఈ అత్యధిక విలువ గల రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించింది. దీని తర్వాత స్థానిక బ్యాంకులు, 19 RBI ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ నోట్లను తిరిగి మార్పిడి చేసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ 23 మే నుండి 30 సెప్టెంబర్ 2023 వరకు సమయం ఇచ్చింది. అయితే, దీని తర్వాత ఈ గడువు నిరంతరంగా పొడిగించబడుతూనే ఉంది. అయితే., ఈ నోట్లను ఇప్పటికీ మార్చుకోవచ్చు. కాకపోతే ఇది స్థానిక బ్యాంకుల్లో సాధ్యం కాదు. చెలామణిలో లేని ఈ నోట్లను అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా వంటి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేస్తామని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్న, తిరువనంతపురం వెళ్లడమే కాకుండా.. ప్రజలు తమకు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు ద్వారా కూడా ఈ నోట్లను డిపాజిట్ చేయవచ్చు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!