Real Mafia: ఆదిలాబాద్ జిల్లా భూములపై అక్రమార్కుల కన్ను.. జోరుగా రియల్ దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Real Mafia: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా దశాబ్దాల క్రితం మూతపడింది. కానీ, ఈ భూముల విలువ కోట్లలో పలుకుతోంది. దీంతో సీసీఐ భూములపై కన్నేసాయి రియల్ మాఫియాలు. ఇప్పటికే ఫ్యాక్టరీ పనిముట్లు అన్ని తుప్పు పట్టే స్థాయికి చేరిపోయాయి..కూలుతున్న గోడలు, పనికిరాని పరికరాలతో పిచ్చి చెట్లు పొదలతో ఉండిపోయింది..అయితే భూములు, పనిముట్ల రక్షణ కోసం సీసీఐ కి చెందిన అధికారులున్నారు..కానీ, లీజ్ ల్యాండ్ లు, సిమెంట్ పరిశ్రమకు ఉపయోగపడే లైమ్ స్టోన్ తరలించుకుపోతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో బడా బాబులు, రియల్ వ్యాపారులు వెంచర్లు వేస్తూ తెగనమ్ముతున్నారు.
Read Also : Gun Fire : చికాగోలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో 2 వేల ఎకరాల భూమి ఉంది..ఇందులో 800 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి, మరో 12వందల ఎకరాల లీజు భూములు ఉన్నాయి. అయితే ఉత్పత్తి లేకపోవడం, అలాగే వృథాగా ఉండటంతో భూములపై అక్రమార్కుల కన్నుపడింది. నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి లీజు స్థలాల సాకు చూపెడుతూ భూములు ఆక్రమించేస్తున్నారు రియల్టర్లు. రాజకీయనేతల పలుకుబడితో మరి కొంతమంది సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బడా లీడర్ల అండతో రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. తాజాగా భూములు కబ్జా, అలాగే రియల్ వెంచర్లు వేసే ప్రదేశానికి వివిధ పార్టీలు, సంఘాల నాయకులు వెళ్లి పరిశీలించారు. కబ్జా కాకుండా భూములను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. లీజ్ ల్యాండ్ అయితే ఎన్ ఓసీ ఎవ్వరు ఇచ్చారని, రియల్ వ్యాపారులకు ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ప్రశ్నలొస్తున్నాయంటున్నారు బీజేపీ నేతలు.
Read Also: Tollywood: విషాదంలో టాలీవుడ్.. సుధీర్ అంత్యక్రియలు పూర్తి
అత్యంత నాణ్యమైన.. కోట్లు విలువ చేసే లైమ్ స్టోన్ తవ్విపోస్తున్నారు మరి కొందరు కేటుగాళ్లు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసామని సీసీఐ అధికారులు చెబుతున్నారు. రియల్ వ్యాపారులు మాత్రం యధేచ్చగా భూములు అమ్ముకుంటున్నారు. రియల్ వెంచర్లు, ప్లాట్లుగా చేసి అమ్మడంలో పాత్ర ఎవ్వరిది, భూములను సీసీఐ వదిలేసుకుంటుందా అనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది.
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..