Real Mafia: ఆదిలాబాద్ జిల్లా భూములపై అక్రమార్కుల కన్ను.. జోరుగా రియల్ దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Real Mafia: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా దశాబ్దాల క్రితం మూతపడింది. కానీ, ఈ భూముల విలువ కోట్లలో పలుకుతోంది. దీంతో సీసీఐ భూములపై కన్నేసాయి రియల్ మాఫియాలు. ఇప్పటికే ఫ్యాక్టరీ పనిముట్లు అన్ని తుప్పు పట్టే స్థాయికి చేరిపోయాయి..కూలుతున్న గోడలు, పనికిరాని పరికరాలతో పిచ్చి చెట్లు పొదలతో ఉండిపోయింది..అయితే భూములు, పనిముట్ల రక్షణ కోసం సీసీఐ కి చెందిన అధికారులున్నారు..కానీ, లీజ్ ల్యాండ్ లు, సిమెంట్ పరిశ్రమకు ఉపయోగపడే లైమ్ స్టోన్ తరలించుకుపోతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో బడా బాబులు, రియల్ వ్యాపారులు వెంచర్లు వేస్తూ తెగనమ్ముతున్నారు.
Read Also : Gun Fire : చికాగోలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు
Also Read
- Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
- Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
- Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
- Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో 2 వేల ఎకరాల భూమి ఉంది..ఇందులో 800 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి, మరో 12వందల ఎకరాల లీజు భూములు ఉన్నాయి. అయితే ఉత్పత్తి లేకపోవడం, అలాగే వృథాగా ఉండటంతో భూములపై అక్రమార్కుల కన్నుపడింది. నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి లీజు స్థలాల సాకు చూపెడుతూ భూములు ఆక్రమించేస్తున్నారు రియల్టర్లు. రాజకీయనేతల పలుకుబడితో మరి కొంతమంది సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బడా లీడర్ల అండతో రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. తాజాగా భూములు కబ్జా, అలాగే రియల్ వెంచర్లు వేసే ప్రదేశానికి వివిధ పార్టీలు, సంఘాల నాయకులు వెళ్లి పరిశీలించారు. కబ్జా కాకుండా భూములను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. లీజ్ ల్యాండ్ అయితే ఎన్ ఓసీ ఎవ్వరు ఇచ్చారని, రియల్ వ్యాపారులకు ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ప్రశ్నలొస్తున్నాయంటున్నారు బీజేపీ నేతలు.
Read Also: Tollywood: విషాదంలో టాలీవుడ్.. సుధీర్ అంత్యక్రియలు పూర్తి
అత్యంత నాణ్యమైన.. కోట్లు విలువ చేసే లైమ్ స్టోన్ తవ్విపోస్తున్నారు మరి కొందరు కేటుగాళ్లు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసామని సీసీఐ అధికారులు చెబుతున్నారు. రియల్ వ్యాపారులు మాత్రం యధేచ్చగా భూములు అమ్ముకుంటున్నారు. రియల్ వెంచర్లు, ప్లాట్లుగా చేసి అమ్మడంలో పాత్ర ఎవ్వరిది, భూములను సీసీఐ వదిలేసుకుంటుందా అనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది.
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!