Gun Fire : చికాగోలో విద్యార్థులపై కాల్పులు.. ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Fire : అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉన్నత చదువుల నిమిత్తం చికాగో వెళ్లిన తెలుగు విద్యార్థులపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్, దేవాన్ష్ లకు బుల్లెట్ గాయాలయ్యాయి. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వాల్ మార్ట్ కి వెళ్తుండగా నల్ల జాతీయులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. వారి శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయి. ఈ కాల్పులలో సాయిచరణ్, దేవాన్ష్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వారిద్ధరిని మూడో విద్యార్థి హుటాహుటిన చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దేవాన్ష్ చనిపోయాడు. అయితే సాయిచరణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్లు సమాచారం. వీరికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. సాయిచరణ్ తల్లిదండ్రులు బీహెచ్ఈఎల్ ఎల్ఐసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. సాయిచరణ్ స్నేహితులు జరిగిన ఘటనని అతని తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు.
Read Also: Republic Day: గణతంత్ర వేడుకలపై వీడని సస్పెన్స్.. ఈ ఏడాది అక్కడేనా..?
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
చికాగోలో నల్ల జాతీయుల కాల్పుల్లో తెలంగాణ విద్యార్థి సాయిచరణ్ గాయపడడం వారి కుటుంబాన్ని షాక్ కు గురిచేసింది. సాయి చరణ్ త్వరగా కోలుకుని స్వదేశానికి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీహెచ్ఈఎల్ ఎల్ఐసీ కాలనీకి ప్లాట్ నెంబర్(248) చెందిన శ్రీనివాసరావు లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సాయి చరణ్ చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో విద్యని అభ్యసిస్తున్నాడు.. కాగా ఈరోజు ఉదయం చికాగోలో సాయిచరణ్ నల్ల జాతీయుల కాల్పుల్లో గాయపడ్డాడు. అక్కడినుండి ఆయన క్షేమ సమాచారాన్ని తల్లిదండ్రులకు ఎప్పటికీ అప్పుడు సాయి చరణ్ స్నేహితులు అందించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాయిచరణ్ ఆరోగ్యంగా స్వదేశానికి తిరిగి రావాలని సాయి చరణ్ తండ్రి శ్రీనివాసరావు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
Read Also: Arvind Dharmapuri : ప్రశాంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ తిట్లపురాణం
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!