Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం..కొత్త ఇంజిన్లపై అమరవీరుల పేర్లు
- భారతీయ రైల్వే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్
- రోజూ కోట్లాది మంది రైలులో ప్రయాణం
- కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ
- దేశంలోని అమరవీరులను సన్మానించేందుకు ఈ భారతీయ రైల్వే ప్రత్యేక చొరవ
- నూతన డీజిల్ ఇంజిన్లపై అమరవీరుల పేర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం ప్రస్తుతం ఇంత ప్రశాంతంగా ఉందంటే.. సరిహద్దుల్లోని భద్రతా దళం యొక్క త్యాగం ఎనలేనిది. వారు అక్కడ రాత్రింబవళ్లు కాపుకాస్తూ..ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు..కాబట్టే మనం స్వేచ్ఛావాయువును పీలుస్తున్నాం. భారత్ చుట్టుపక్కల ఎటు చూసినా శత్రుదేశాలే ఉన్నాయి. ఎప్పుడు సమయం దొరుకుతుందా..? ఎప్పుడు భారత్ ను నాశనం చేద్దామా? అని చైనా లాంటి శత్రుదేశాలు గుంటనక్కల్లా ఎదురుచూస్తున్నాయి. అలాంటి వారిని ఎదుర్కొంటు..దేశ సేవలో ప్రాణాలు వదులుతున్న సైనిక అమర వీరులకు అరుదైన గౌరవం దక్కింది. భారత రైల్వే అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తోంది.
READ MORE: OTT: ఈ వారంలో ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
భారతీయ రైల్వే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్. దేశవ్యాప్తంగా ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా వెళ్లడానికి ఇది సహాయపడుతుంది. రోజూ కోట్లాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. దేశంలోని అమరవీరులను సన్మానించేందుకు ఈ భారతీయ రైల్వే ప్రత్యేక చొరవ తీసుకుంది. భారతీయ రైల్వే ఇటీవలే డీజిల్ ఇంజిన్లను పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త ఇంజిన్లపై దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ..వారి పేర్లను నూతన ఇంజిన్లపై రాయనుంది. ఈ మేరకు భారతీయ రైల్వే గురువారం ఎక్స్ వేదికగా సమాచారం ఇచ్చింది. ఇందుకోసం రైల్వేశాఖ సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా షేర్ చేసింది.
READ MORE: CM Chandrababu: బెంగాల్ మాజీ సీఎం మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
దేశంలోని అమరవీరులకు నివాళులు అర్పించేందుకు, ఈ వీర అమరవీరుల పేర్లను రైల్వే లోకోమోటివ్ డీజిల్ ఇంజిన్లకు రైల్వే శాఖ పెట్టనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. దీని కోసం.. రైల్వేస్ కొత్త గ్లీమింగ్ ఇంజిన్పై అమరవీరుల పేర్లను వ్రాసిన వీడియో, ఫోటోను కూడా షేర్ చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేస్తూ.. “భారత రైల్వే తన అమరవీరులను స్మరించుకుంటూ వారికి హృదయపూర్వక నివాళులర్పిస్తుంది. ఉత్తర రైల్వే తన డీజిల్ లోకోమోటివ్ ఇంజిన్లకు మన వీర వీరుల పేరు పెట్టింది. భారతీయ రైల్వే వారి అసాధారణ నాయకత్వానికి నివాళులర్పిస్తుంది. అత్యున్నత త్యాగానికి నివాళులు అర్పిస్తుంది.” అని రాసుకొచ్చింది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!