Bangladesh: మరో నిరసన పర్వం.. గంటలోపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా!
- శనివారం బంగ్లాదేశ్లో మరోసారి నిరసనలు
- ఢాకాలోని సుప్రీంకోర్టును చుట్టుముట్టిన నిరసన కారులు
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గంటలోపు రాజీనామా చేయాలని డిమాండ్
- ఇప్పటికే బంగ్లా బ్యాంక్ గవర్నర్ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం బంగ్లాదేశ్లో మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఆందోళనకారులు ఇప్పుడు ఢాకాలోని సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయమూర్తులందరూ గంటలోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేయకుంటే వారి నివాసాలపై దాడులు చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.
READ MORE: Varun Tej Matka : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్, టైం ఫిక్స్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఆందోళనకారులు ఇటీవల కేంద్ర బ్యాంక్ కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. బంగ్లా బ్యాంక్ గవర్నర్ శుక్రవారం తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయనకు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉంది. అబ్దుల్ రౌఫ్ 2022 జూలైలో బంగ్లా బ్యాంక్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో దేశంలో తీవ్ర కరెన్సీ పతనం, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మార్కెట్ల వడ్డీ రేట్లలో సరళతరమైన మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. కానీ బ్యాంకింగ్ రంగంలో రుణాల డిఫాల్ట్ కేసులు ఆ సమయంలోనే పెరిగినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
READ MORE:Nitin Gadkari: పంజాబ్లో శాంతిభద్రతలు సరిగ్గా లేవు.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన గడ్కరీ
కాగా.. గురువారం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాడింది. పాలనాపగ్గాలు మారడం ద్వారా బంగ్లాదేశ్కు మరోసారి స్వాతంత్య్రం వచ్చినట్లయిందని, దీనిని కాపాడుకోవాలని తాత్కాలిక ప్రభుత్వ సారథి, నోబెల్ పురస్కార గ్రహీత ముహమ్మద్ యూనుస్ పిలుపునిచ్చారు. పౌరుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని, వారిపై దాడుల్ని ఆపడం ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా గురువారం రాత్రి ఆయనచేత అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి హోదాకు సమానమైన ముఖ్య సలహాదారుగా యూనుస్ వ్యవహరిస్తారు.
Protest on demanding resignation of Bangladesh Chief Justice. Ultimatum has been given to him.
📹copied pic.twitter.com/h1QxjQrISo— MUKTADIR rashid ROMEO (@muktadirnewage) August 10, 2024
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..