PM Modi: సనాతన్కు వ్యతిరేకంగా భారత కూటమి ముందుంది.. ప్రతిపక్షాలపై ప్రధాని విసుర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో జరిగిన విజయ శంఖనాద్ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయడంపై డీఎంకే నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యపై కూడా ఆయన మండిపడ్డారు. ఛత్తీస్గఢ్లోని ఈ భూమి శ్రీరాముడి జన్మస్థలమని ప్రధాని అన్నారు. ఇక్కడ కౌశల్య మాత యొక్క గొప్ప ఆలయం ఉందని మోడీ తెలిపారు. విపక్షాలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ఈ రోజు మన విశ్వాసం, మన దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర గురించి మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నానని తెలిపారు. మీరందరూ గత తొమ్మిదేళ్లుగా కేంద్రం నుండి దూరంగా ఉన్న వ్యక్తులు అని అన్నారు. నిరంతరం ఎన్నికలలో ఓడిపోతున్నారని.. వారు ఇప్పుడు మీ పట్ల చాలా ద్వేషంతో ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. వారు మీ గుర్తింపు, సంస్కృతికి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ తెరిచారని విమర్శించారు.
Read Also: Perni Nani: ఇది ములాఖత్ కాదు.. మిలాఖత్..! పవన్ సెటిల్మెంట్ కోసమే వెళ్లాడు..
Also Read
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
ప్రతిపక్షాలంతా కలిసి కూటమిని ఏర్పాటు చేసుకున్నారని ప్రధాని అన్నారు. ఇప్పుడు వీరంతా భారతదేశం యొక్క శాశ్వతమైన సంస్కృతిని నాశనం చేస్తున్నారని.. తమ అధికార దురాశతో దానిని విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకున్నారని మోడీ తెలిపారు. మరోవైపు సనాతన ధర్మంపై ప్రధాని మాట్లాడుతూ.. రాముడు శబరిని తల్లిగా పిలిచి రేగు పండ్లను తిని ఆనందించడం సనాతన సంస్కృతి అని అన్నారు. శ్రీ రాముడు పడవ నడిపే వ్యక్తిని కౌగిలించుకుని ఆశీర్వదించడం, అతని కోసం వానర సైన్యం పోరాడడం సనాతన సంస్కృతి అని అన్నారు. సనాతన సంస్కృతి అంటే కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టుకకు కాకుండా అతని కర్మలకు ప్రాధాన్యతనిస్తుందని మోడీ తెలిపారు. సనాతన్కు వ్యతిరేకంగా భారత కూటమి ముందుందని పేర్కొన్నారు.
Read Also: Aliens: ఇంతకీ.. ఏలియన్స్ ఉన్నాయా.. లేదా..? అనేదానిపై నాసా కీలక ప్రకటన
ప్రధాని మాట్లాడుతూ.. దేశంలోని పేదలకు సాధికారత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. పేదల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం పథకాలు రూపొందించడం వల్లే ఇది జరిగిందన్నారు. పేదలకు పేదరికంపై పోరాడే మార్గాన్ని బీజేపీ ఇచ్చిందని ఈ సందర్భంగా ప్రధాని తెలియజేశారు.
తాజావార్తలు
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!