Mallikarjun Kharge: గ్యాస్ ధర తగ్గింపుపై విమర్శలు.. ఎన్నికల లాలీపాప్గా అభివర్ణించిన ఖర్గే
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గించడంపై రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీ.. రక్షా బంధన్కు ముందు దేశంలోని సోదరీమణులకు ప్రధాని మోడీ ఇచ్చిన బహుమతి అని అటుండగా.. మరోవైపు కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష కూటమి ఎన్నికల బహుమతిగా విమర్శలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఇది ఎన్నికల లాలీపాప్గా అభివర్ణించారు. అది ఇప్పట్లో పనికి రాదని అన్నారు. ఎప్పుడైతే బీజేపీకి ఓట్లు తగ్గుతాయో.. ఎన్నికల కానుకల పంపిణీ మొదలైందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్లో పేర్కొన్నారు. ఇది తల్లులు మరియు సోదరీమణుల కోసం చూపించే గుడ్విల్ అని ఆయన అన్నారు. గత 9 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1100కి పెంచిందని తెలిపారు. ద్రవ్యోల్బణం సామాన్యుడి జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు, మీకు ఏ బహుమతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
Kalki 2898AD: బిగ్ బ్రేకింగ్.. కల్కి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి ..?
Also Read
200 రూపాయల సబ్సిడీ ఇచ్చి దేశంలోని కష్టాల్లో ఉన్న ప్రజల కోపాన్ని తగ్గించలేమన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని ఖర్గే సూచించారు. ఈసారి ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు బీజేపీకి మార్గాన్ని చూపడం ఒక్కటే ఆప్షన్గా ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో కేవలం రూ.500లకే పేదలకు సిలిండర్లు ఇవ్వబోతోందని.. ఇది రాజస్థాన్లో కూడా అమలు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనను విపక్షాలు చూస్తున్నాయి. అయితే ఇది రక్షా బంధన్ నాడు దేశవ్యాప్తంగా ఉన్న తల్లులు, సోదరీమణులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన కానుక అని అధికార పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు చెబుతున్నారు.
Allu Arjun: బన్నీ ఫాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. ఇండియాలోనే తొలిసారిగా?
మరోవైపు ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 న ప్రతిపక్ష కూటమి (ఇండియా) యొక్క మూడవ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం ముంబైలో జరుగనుండగా.. ద్రవ్యోల్బణంతో సహా అనేక అంశాలపై వ్యూహరచనతో పాటు, కన్వీనర్ పేరును కూడా ప్రకటించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విపక్ష కూటమికి భయపడిపోయిందని, అందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
जब वोट लगे घटने, तो चुनावी तोहफ़े लगे बटने !
जनता की गाढ़ी कमाई लूटने वाली, निर्दयी मोदी सरकार, अब माताओं-बहनों से दिखावटी सद्भावना जता रही है।
साढ़े 9 सालों तक ₹400 का #LPG सिलेंडर, ₹1100 में बेच कर, आम आदमी की ज़िंदगी तबाह करते रहे, तब कोई “स्नेह भेंट” की याद क्यों नहीं…
— Mallikarjun Kharge (@kharge) August 29, 2023
- Tags
- bjp
- congress
- gas price
- Kharge
- opposition
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!