Mallikarjun Kharge: గ్యాస్ ధర తగ్గింపుపై విమర్శలు.. ఎన్నికల లాలీపాప్గా అభివర్ణించిన ఖర్గే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గించడంపై రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీ.. రక్షా బంధన్కు ముందు దేశంలోని సోదరీమణులకు ప్రధాని మోడీ ఇచ్చిన బహుమతి అని అటుండగా.. మరోవైపు కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష కూటమి ఎన్నికల బహుమతిగా విమర్శలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఇది ఎన్నికల లాలీపాప్గా అభివర్ణించారు. అది ఇప్పట్లో పనికి రాదని అన్నారు. ఎప్పుడైతే బీజేపీకి ఓట్లు తగ్గుతాయో.. ఎన్నికల కానుకల పంపిణీ మొదలైందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్లో పేర్కొన్నారు. ఇది తల్లులు మరియు సోదరీమణుల కోసం చూపించే గుడ్విల్ అని ఆయన అన్నారు. గత 9 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1100కి పెంచిందని తెలిపారు. ద్రవ్యోల్బణం సామాన్యుడి జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు, మీకు ఏ బహుమతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
Kalki 2898AD: బిగ్ బ్రేకింగ్.. కల్కి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి ..?
Also Read
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
200 రూపాయల సబ్సిడీ ఇచ్చి దేశంలోని కష్టాల్లో ఉన్న ప్రజల కోపాన్ని తగ్గించలేమన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని ఖర్గే సూచించారు. ఈసారి ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు బీజేపీకి మార్గాన్ని చూపడం ఒక్కటే ఆప్షన్గా ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో కేవలం రూ.500లకే పేదలకు సిలిండర్లు ఇవ్వబోతోందని.. ఇది రాజస్థాన్లో కూడా అమలు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనను విపక్షాలు చూస్తున్నాయి. అయితే ఇది రక్షా బంధన్ నాడు దేశవ్యాప్తంగా ఉన్న తల్లులు, సోదరీమణులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన కానుక అని అధికార పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు చెబుతున్నారు.
Allu Arjun: బన్నీ ఫాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. ఇండియాలోనే తొలిసారిగా?
మరోవైపు ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 న ప్రతిపక్ష కూటమి (ఇండియా) యొక్క మూడవ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం ముంబైలో జరుగనుండగా.. ద్రవ్యోల్బణంతో సహా అనేక అంశాలపై వ్యూహరచనతో పాటు, కన్వీనర్ పేరును కూడా ప్రకటించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విపక్ష కూటమికి భయపడిపోయిందని, అందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
जब वोट लगे घटने, तो चुनावी तोहफ़े लगे बटने !
जनता की गाढ़ी कमाई लूटने वाली, निर्दयी मोदी सरकार, अब माताओं-बहनों से दिखावटी सद्भावना जता रही है।
साढ़े 9 सालों तक ₹400 का #LPG सिलेंडर, ₹1100 में बेच कर, आम आदमी की ज़िंदगी तबाह करते रहे, तब कोई “स्नेह भेंट” की याद क्यों नहीं…
— Mallikarjun Kharge (@kharge) August 29, 2023
- Tags
- bjp
- congress
- gas price
- Kharge
- opposition
తాజావార్తలు
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!