TDP-BJP-Janasena: టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో చంద్రబాబు, అమిత్ షా, పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మళ్లీ ఎన్డీయేలో చేరడం సంతోషంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి సేవ చేయడం కోసమే టీడీపీ – బీజేపీ- జనసేన మధ్య పొత్తు కుదిరిందని తెలిపారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. మోడీ, అమీత్ షా, నడ్డా, పవన్ కళ్యాణ్ కలిసి ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికే సమయం కోసం ఎదురుచూస్తున్నా.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం కూటమి స్వర్ణయుగం తెస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఏపీ ప్రజలు తమకు సేవ చేసేందుకు చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఆశీర్వదించాలని చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
Arun Goel: లోక్సభ ఎన్నికల ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా..
మరోవైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి ఏపీ ప్రజల ఆకాంక్షలను వేగంగా నెరవేర్చుతుందని తెలిపారు. మోడీ నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని చాటుతూ టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీయేలో చేరాయన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాలను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నా.. నరేంద్ర మోడీ దార్శనికత నాయకత్వంలో ఎన్డీఏ బలమైన రాజకీయ వేదికగా ఏర్పడుతోందని ట్వీట్ లో తెలిపారు.

బీజేపీ-టీడీపీ-జనసేనలది చారిత్రాత్మక కూటమి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో తెలిపారు. ఏపీ ప్రజలకు ఆశ, స్థిరత్వం శ్రేయస్సు అందించడమే కూటమి లక్ష్యం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బాధ్యతాయుతమైన భాగస్వాములుగా పని చేస్తాం.. ఏపీని అన్ని విధాలుగా శక్తివంతమైన రాష్ట్రంగా మార్చడానికి మా వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్డీఏ సహజ భాగస్వామి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ, రాష్ట్ర శ్రేయస్సు కోసం మా ఎన్డీఏ కూటమిని మరింత స్థిరీకరించడానికి ఎదురు చూస్తున్నట్లు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో తెలిపారు.
The fundamental purpose of this historic alliance of BJP-TDP-JSP is to give hope, stability and prosperity to people of AP.
Under dynamic, daring, & visionary leadership of Hon. PM Shri @narendramodi ji , We all will be working as responsible stakeholders who will put our best… pic.twitter.com/Jw6kE54klh— Pawan Kalyan (@PawanKalyan) March 9, 2024
తాజావార్తలు
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!