IND vs NZ 3rd Test: వాంఖడేలో మొదటి రోజు ఎవరికి అనుకూలం.. పిచ్ రిపోర్ట్ ఇదే..!
- భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్
- నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్
- మూడో టెస్టుకు సంబంధించిన రిపోర్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. చివరి మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే.. ఈ సిరీస్ని కైవసం చేసుకున్న న్యూజిలాండ్.. క్లీన్ స్వీప్ పై కన్నేసింది. మరోవైపు.. చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా చూస్తోంది. కాగా.. సిరీస్ స్కోర్లైన్ ఎలా ఉంటుందనేది సిరీస్ చివరి మ్యాచ్ నిర్ణయిస్తుంది. ఇదిలా ఉంటే పిచ్ ఎలా ఉంటుందో మూడో టెస్టుకు సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇక్కడ ర్యాంక్ టర్నర్ పిచ్ ఉండదని, దానిపై స్పిన్నర్లకు టర్న్ వస్తుందని.. అయితే మొదటి రోజు పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని నివేదికలలో పేర్కొన్నారు. బెంగళూరులో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తే.. పూణెలో స్పిన్నర్లకు అనుకూలించింది. అయితే ముంబైలో వాతావరణం కాస్త భిన్నంగా ఉండవచ్చు.
Kollu Ravindra: త్వరలో ఏపీలో మంచి మైనింగ్ పాలసీ తీసుకొస్తాం..!
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
సోమవారం బీసీసీఐ చీఫ్, పిచ్ క్యూరేటర్ ఆశిష్ భౌమిక్.. ఎలైట్ ప్యానెల్ క్యూరేటర్ తపోష్ ఛటర్జీతో పాటు ముంబై వాంఖడే స్టేడియం క్యూరేటర్ రమేష్ మముంకర్ కలిసి పిచ్ను సమీక్షించారు. “ఇది స్పోర్టింగ్ ట్రాక్ అవుతుంది. ప్రస్తుతం పిచ్పై కొంత పచ్చిక ఉంది. ఈ వికెట్ మొదటి రోజు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే రెండవ రోజు నుండి స్పిన్నర్లు టర్న్ పొందడం ప్రారంభిస్తుంది” అని తెలిపారు.
CM Revanth: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై సీఎం కీలక వ్యాఖ్యలు..
చివరిసారిగా 2021 డిసెంబర్లో ఇరు జట్ల మధ్య ఇక్కడ టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో భారత్ 372 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఆ మ్యాచ్లో మొదటి రోజు నుండి స్పిన్నర్లకు సహకరించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 62 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 276/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీనికి సమాధానంగా న్యూజిలాండ్ జట్టు 167 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో అజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. టీమిండియా బౌలర్ అశ్విన్ 42 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..