IND vs NZ 3rd Test: వాంఖడేలో మొదటి రోజు ఎవరికి అనుకూలం.. పిచ్ రిపోర్ట్ ఇదే..!
- భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్
- నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్
- మూడో టెస్టుకు సంబంధించిన రిపోర్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. చివరి మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే.. ఈ సిరీస్ని కైవసం చేసుకున్న న్యూజిలాండ్.. క్లీన్ స్వీప్ పై కన్నేసింది. మరోవైపు.. చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా చూస్తోంది. కాగా.. సిరీస్ స్కోర్లైన్ ఎలా ఉంటుందనేది సిరీస్ చివరి మ్యాచ్ నిర్ణయిస్తుంది. ఇదిలా ఉంటే పిచ్ ఎలా ఉంటుందో మూడో టెస్టుకు సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇక్కడ ర్యాంక్ టర్నర్ పిచ్ ఉండదని, దానిపై స్పిన్నర్లకు టర్న్ వస్తుందని.. అయితే మొదటి రోజు పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని నివేదికలలో పేర్కొన్నారు. బెంగళూరులో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తే.. పూణెలో స్పిన్నర్లకు అనుకూలించింది. అయితే ముంబైలో వాతావరణం కాస్త భిన్నంగా ఉండవచ్చు.
Kollu Ravindra: త్వరలో ఏపీలో మంచి మైనింగ్ పాలసీ తీసుకొస్తాం..!
Also Read
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
సోమవారం బీసీసీఐ చీఫ్, పిచ్ క్యూరేటర్ ఆశిష్ భౌమిక్.. ఎలైట్ ప్యానెల్ క్యూరేటర్ తపోష్ ఛటర్జీతో పాటు ముంబై వాంఖడే స్టేడియం క్యూరేటర్ రమేష్ మముంకర్ కలిసి పిచ్ను సమీక్షించారు. “ఇది స్పోర్టింగ్ ట్రాక్ అవుతుంది. ప్రస్తుతం పిచ్పై కొంత పచ్చిక ఉంది. ఈ వికెట్ మొదటి రోజు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే రెండవ రోజు నుండి స్పిన్నర్లు టర్న్ పొందడం ప్రారంభిస్తుంది” అని తెలిపారు.
CM Revanth: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై సీఎం కీలక వ్యాఖ్యలు..
చివరిసారిగా 2021 డిసెంబర్లో ఇరు జట్ల మధ్య ఇక్కడ టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో భారత్ 372 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఆ మ్యాచ్లో మొదటి రోజు నుండి స్పిన్నర్లకు సహకరించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 62 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 276/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీనికి సమాధానంగా న్యూజిలాండ్ జట్టు 167 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో అజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. టీమిండియా బౌలర్ అశ్విన్ 42 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!