Kollu Ravindra: త్వరలో ఏపీలో మంచి మైనింగ్ పాలసీ తీసుకొస్తాం..!
- త్వరలోనే ఏపీలో మంచి మైనింగ్ పాలసీ తీసుకోస్తాం..
- రాష్ట్రంలో చంద్రబాబు ఉచితంగా ఇసుకను అందజేస్తున్నారు..
- నిర్మాణ రంగం అభివృద్ధి్కి పూర్తిగా కట్టుబడి ఉన్నాం: మంత్రి కొల్లు రవీంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మంచి మైనింగ్ పాలసీ తీసుకు వస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయంలో బాధితులుగా ఉన్న స్టోన్ క్రషర్స్, మిల్లర్స్ నిర్వహకులతో సమావేశం నిర్వహించామన్నారు. గత మైనింగ్ మంత్రి రాష్ట్రంలోని బెదిరింపులకు పాల్పడి మైనింగ్ ను పూర్తిగా అస్తగతం చేసుకున్నారని ఆరోపించారు. లొంగని వారిపై అధికారులను పంపించి అక్రమంగా కేసులు పెట్టించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది క్వారీలు నిర్వహించలేక మూసేసుకున్నారు.. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి కలిసి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారు అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన స్టోన్ క్రషర్స్, మిల్లర్స్ సమస్యలు మా దృష్టికి తీసుకు వచ్చారు.. గడిచిన ఐదేళ్లలో ఇసుకలో అక్రమంకు వసూల్లు చేశారని ఆరోపించారు. ఇక, వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది అని కొల్లు రవీంద్ర వెల్లడించారు.
Read Also: AB PM-JAY: వృద్ధులకు ప్రధాని మోడీ దీపావళి కానుక.. ఏటా 5 లక్షల వరకు..
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ఇక, సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను అమలు చేశారని మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు. ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు కల్పించాం.. రాష్ట్రంలో సినారేజ్ చార్జీలు లేకుండా ఇసుక అందిస్తున్నాం.. రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని వెల్లడించారు. అలాగే, విశాఖపట్నంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నాం.. నాతవరం మండలంలో సారుగుడు, సుందరకోట పంచాయితీలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లాటరైట్ త్రవ్వకాలపై విచారణ కొనసాగుతుంది.. ఈ వ్యవహారంలో కొందరు మంత్రులపై ఫిర్యాదులు వచ్చాయి.. విచారణ తరువాత చర్యలు తీసుకుంటాము.. ఇసుకలో అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. జిల్లా సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం.. మద్యాన్ని జగన్ కబంధహస్తాలలో పెట్టుకున్నారు.. ఎక్సైజ్ పాలసీని విచ్ఛిన్నం చేశారు.. ప్రభుత్వ దుకాణాలు పెట్టి వారికి కావలసిన బ్రాండ్లు విక్రయించారు.. బెల్ట్ షాపులు పెడితే ఉపేక్షించేది లేదు.. ఎంఆర్పీ రేట్లు కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!