CM Revanth: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై సీఎం కీలక వ్యాఖ్యలు..
- సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్
- కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలనేది నా అభిమతం- సీఎం రేవంత్
- కేటీఆర్ తోని కేసీఆర్ ఉనికి లేకుండా చేశాను- సీఎం
- మూసీ పై అఖిలపక్షానికి రెడీ- ముఖ్యమంత్రి
- కేసీఆర్.. కేటీఆర్ బామ్మర్దులు పార్టీలు చేసుకోవడానికి ఫార్మ్ హౌస్లు ఉన్నాయి
- మూసీ పక్కన సామాన్య ప్రజలు దుర్భర జీవితం గడపాలా- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలనేది తన అభిమతం అన్నారు. కేటీఆర్తోని కేసీఆర్ ఉనికి లేకుండా చేశాను.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడానికి ఆయన కొడుకునే వాడానని అన్నారు. ఇక భవిష్యత్తులో కేటీఆర్ని రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్ రావుని వాడుతానని తెలిపారు. మరోవైపు.. మూసీ పై అఖిలపక్షానికి రెడీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్కు తనను కలవడం ఇష్టం లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కైనా మూసీ పైనా అభిప్రాయాలు ఇవ్వండని సూచించారు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి.. ఎలాంటి అభిప్రాయాలనైనా తీసుకోవడానికి తాను రెడీగా ఉన్నానని సీఎం చెప్పారు.
Bangladesh: షేక్ హసీనా లగ్జరీ ప్యాలెస్.. ఇప్పుడు ‘‘విప్లవ మ్యూజియం’’..
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
చర్చ జరగకుండా అభివృద్ధి జరగదు.. తాను మూసీ పై చర్చ జరగాలని కోరుకుంటున్నాను.. అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. అఖిలపక్షానికి మీరు వస్తే కచ్చితంగా మూసీ పై అఖిలపక్షం పెడతానని అన్నారు. మూసీలో జీవించడానికి.. మూసీ పక్కన ఉండడానికి ఎవరికి ఇష్టం ఉండదు.. మూసీలో లగ్జరీ ఉంటుందా అని సీఎం పేర్కొన్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్కు ఎందుకు అర్థం కావడం లేదని అన్నారు. మూసీ జనాలను మూసీలోనే ఉండాలని కోరుకుంటున్నారా.. ఈటల రాజేందర్ మూసీ పైన చేస్తున్న అభ్యంతరాలు నిర్మాణాత్మకంగా లేవు.. అతనిపైన కేటీఆర్, హరీష్ రావు ఒత్తిడి ఉందని సీఎం తెలిపారు. మూసీ పునర్జీవం కోసం రూ. 1,50,000 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెడుతున్నారు అనేది నిజం కాదు.. నిధులన్నీ ప్రైవేటు సంస్థలతోనే సమీకరించి వాళ్లతోనే ఖర్చు చేయించి మూసీని సుందరీకరణ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
Ram Pothineni: మహేష్ బాబుతో రామ్ పోతినేని.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
మరోవైపు.. కేసిఆర్, కేటీఆర్ బామ్మర్దులు పార్టీలు చేసుకోవడానికి ఫార్మ్ హౌస్లు ఉన్నాయి.. మూసీ పక్కన సామాన్య ప్రజలు దుర్భర జీవితం గడపాలా అని అన్నారు. గండిపేట ఏరియాలో ఫామ్ అవధులు కట్టుకొని మీ కాలుష్యం అంతా మూసీ పైన వదులుతున్నారు.. వాళ్లు ఆ కాలుష్యంతో బతకాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పుడు నాలుగు గోడల మధ్య పరిమితమై ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు అంటే అది తన వల్లే అయిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేటీఆర్ని బయటికి తీసుకొచ్చి తండ్రిని ఫామ్ హౌస్ పరిమితం చేశాని ముఖ్యమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!