Israel Hamas War: గాజాలో రోజురోజుకు దిగజారిపోతున్న మహిళలు, చిన్నారుల పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-గాజా యుద్ధం ఆగిపోయే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ రక్తపాత సంఘర్షణలో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సుమారు 16 వేల మంది ఈ యుద్ధంలో మరణించారు. ఇజ్రాయెల్పై హమాస్ ఆకస్మిక దాడి తర్వాత ప్రతి గంటకు ఇద్దరు తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ యుద్ధం జరిగి 100 రోజులకు పైగా గడిచినా ఇప్పటి వరకు పరిష్కారం మాత్రం దొరకలేదు.
Read Also: Rolls Royce Spectre : రూ.7.5కోట్ల రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు లాంచ్.. లగ్జరీ కారు ఫీచర్లు ఇవే
Also Read
- Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
అయితే, తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ యుద్ధం వల్ల సుమారు 3,000 మంది మహిళలు వితంతువులుగా మారినట్లు తెలిపింది. అలాగే, దాదాపు 10,000 మంది చిన్నారులు తమ తండ్రులను కోల్పోయారు. ఈ ప్రాంతంలోని 2.3 మిలియన్ల జనాభాలో 1.9 మిలియన్లు నిరాశ్రయులయ్యారు.. దాదాపు పది లక్షల మంది మహిళలు, చిన్నారులు ఆశ్రయం, రక్షణ కోసం వెతుకుతున్నారని తెలిపింది. ఇక, అక్టోబర్ 7న జరిగిన ఇజ్రాయెల్-హమాస్ దాడిపై UN ఉమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ మాట్లాడుతూ.. గాజా, వెస్ట్ బ్యాంక్లో మరణించిన పౌరులందరిలో 67 శాతం మంది పురుషులు ఉండగా14 శాతం కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారని ఆమె సూచించారు.
Read Also: Hanuman Collections: అల వైకుంఠపురములో అవుట్… నెక్స్ట్ టార్గెట్ ప్రభాస్-జక్కన్న సినిమాలే…
మానవతావాద దృక్పథంతో కాల్పుల విరమణ చెయ్యాలని అమెరికా సూచించింది. ఇజ్రాయెల్లో బందీలుగా ఉన్న వారందరినీ తక్షణమే విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపుని కూడా SIMA పునరుద్ఘాటించింది. కాగా, ప్రస్తుతం గాజాలో మహిళలు, చిన్నారుల పరిస్థితి దారుణంగా దిగజారి పోయిందన్నారు. గాజాలో ఉన్న వారి కోసం భద్రత, వైద్య సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, ఆశ్రయం కల్పించాలని గుటెర్సెస్ కోరారు. అయితే, హమాస్ ఆధ్వర్యంలో ఉన్న గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఘర్షణలో దాదాపు 25,000 మంది పాలస్తీనియన్లు మరణించారని తెలిపారు. వారిలో 70 శాతం మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని చెప్పుకొచ్చారు. గాజా జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ఆకలితో చనిపోతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. గాజాలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ బందీలు ఇప్పటికీ ఉన్నట్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Karuppu : ‘కరుప్పు’ సక్సెస్పై సూర్య ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..