CEC: విజయవాడ చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం.. మూడు రోజుల పాటు పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకుంది. ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల బృందం పర్యటించనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకోగా.. వారికి విమానాశ్రయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, బెజవాడ సీపీ స్వాగతం పలికారు. అనంతరం.. సీఈఓ ఎంకే మీనాతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. రేపటి సమావేశం అజెండా అంశాలపై సమీక్ష నిర్వహించారు. సీఈసీ బృందం మూడ్రోజుల పర్యటనలో భాగంగా.. రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం రేపు (జనవరి 9) సమావేశం కానుంది. సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల అధికారులతో సీఈసీ బృందం ఎల్లుండి (జనవరి 10) భేటీ కానుంది.
Sajjala Ramakrishna Reddy: జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదు..
Also Read
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మూడు రోజుల పర్యటనలో ఏపీలో అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు, ఓట్ల తొలగింపులు, గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నారు ఈసీ అధికారులు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్ష జరపనుంది. ఇదిలా ఉంటే..10 తేదీన ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
Rana Daggubati :మన సంస్కృతికి, మన మనసులకు చాలా దగ్గరగా ఉండేలా “హనుమాన్” చిత్రం రూపొందింది..
మరోవైపు.. రేపు కేంద్ర ఎన్నికల సంఘంతో వైసీపీ నేతలు సమావేశం కానున్నారు. వైసీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ హాజరుకానున్నారు. టీడీపీ ఓటర్ల నమోదులో అవకతవకలకు పాల్పడుతోందని వైసీపీ ఫిర్యాదు చేయనుంది. మొన్న తెలంగాణలో ఓట్లు వేసిన ఏపీ ఓటర్లు.. రేపు మళ్ళీ ఏపీలో ఓట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనుంది. ఆధారాలతో సహా వైసీపీ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేయనుంది. అటు.. టీడీపీ, జనసేన అధినేతలు ఈసీ అధికారులను కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై లోపాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో లోపాలు, జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి విషయాలపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరనున్నారు.
తాజావార్తలు
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
-
Axar Patel: మిచెల్ స్టార్క్తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..