Bharat Mata Foundation: క్రాకర్ షోలో ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం..
- భారతమాతకు మహా హారతి ఘటనపై స్పందించిన భారతమాత ఫౌండేషన్
- గత 8 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం- భారతమాత ఫౌండేషన్
- ఈ కార్యక్రమం ఒక ఆనవాయితీగా మారింది- భారతమాత ఫౌండేషన్
- ఈ మహా హారతి కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించాలనుకున్నాం- భారతమాత ఫౌండేషన్
- క్రాకర్ షోలో ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం- భారతమాత ఫౌండేషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న భారతమాతకు మహా హారతి కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘటనపై భారతమాత ఫౌండేషన్ స్పందించింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న భాగ్యనగరంలో భారతమాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది. ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులు, యువతలో దేశభక్తిని రేకెత్తించే ఈ కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ ఒక ఆనవాయితీగా మారిందని పేర్కొంది. ఈ ఏడాది రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ మహా హారతి కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించాలని భారతమాత ఫౌండేషన్ తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతను అప్పజెప్పిందని భారతమాత ఫౌండేషన్ తెలిపింది.
Chandrababu: ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే పథకాలు అమలు చేస్తాం..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
రాజమహేంద్రవరంకు చెందిన SG క్రాకర్స్ అనే సంస్థ భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం, భారతదేశం మ్యాప్, జాతీయ త్రివర్ణ పతాకాన్ని క్రాకర్ షో ద్వారా ఆవిష్కరిస్తామని ప్రతిపాదించింది.. ఈ సంస్థకు క్రాకర్ షో నిర్వహణలో 100 సంవత్సరాల అనుభవం ఉందని భారతమాత ఫౌండేషన్ పేర్కొంది. ఇటీవల జనవరి 24న ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలోనూ క్రాకర్ షోను విజయవంతంగా నిర్వహించింది.. 100 ఏళ్ల పురాతన ఈ సంస్థకు క్రాకర్ షో నిర్వహణలో ఉన్న ఘనమైన రికార్డును పరిగణనలోకి తీసుకొని క్రాకర్ షో ప్రతిపాదనలకు భారతమాత ఫౌండేషన్ ఆమోదం తెలిపింది.
Olive Ridley turtles: చెన్నై తీరంలో వేల సంఖ్యలో ‘‘ఆలివ్ రిడ్లే తాబేళ్ల’’ మృతి..
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది భారతమాత మహా హారతి కార్యక్రమం ప్రజల కరతాళ ధ్వనుల మధ్య విజయవంతంగా పూర్తయ్యాయి.. అయితే కార్యక్రమం చివర్లో నిర్వహించే క్రాకర్ షోలో ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం అని భారతమాత ఫౌండేషన్ తెలిపింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు, ఒకరికి తీవ్ర గాయాల పాలవడాన్ని చింతిస్తున్నామని పేర్కొంది. గాయపడిన వారందరికీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరుగైన చికిత్స అందిస్తున్నాం.. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భారతమాత ఫౌండేషన్ అండగా ఉంటుందని వెల్లడించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నామని భారతమాత ఫౌండేషన్ తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..