Rahul Gandhi: భారత్ జోడో యాత్ర వల్లే నాలో అహంకారం పోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ జోడో యాత్రతో నాలోని అహంకారం మొత్తం అణచివేసిందని రాహుల్ గాంధీ చెప్పారు. మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాసంపై లోక్ సభలో జరిగిన చర్చలో రాహుల్ హాజరైయ్యారు. గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్దనేతకు ఇబ్బంది కలిగిందేమోనంటూ ప్రధానిపై రాహుల్ గాంధీ పరోక్షంగా సెటైర్లు వేశారు. అదానీ గురించి ఇవాళ నేను మాట్లాడను.. మీరు భయపడాల్సిన పనిలేదన్నారు. తనది రాజకీయ ప్రసంగం కాదు అని తెలిపారు.
Read Also: Hrithik Roshan : ఆ సమయంలో నన్నుచూసి ఎగతాళి చేసారు..
Also Read
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో తెలిపారు. భారత్ జోడో యాత్ర ఇంకా ముగియలేదన్నారు. లడ్డాఖ్ వరకు తాను యాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. జోడో యాత్రలో అనేక అంశాలను తాను నేర్చుకున్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ప్రజల కష్టాలను దగ్గరుండి చూసినట్టుగా ఆయన వెల్లడించారు. లక్షల మంది తనతో కలిసి రావడంతో తనకు ధైర్యమొచ్చిందని తెలిపారు. పాదయాత్ర చేసే టైంలో తనలో కొద్ది కొద్దిగా అహంకారం మాయమైందన్నారు. పాదయాత్రలో తాను అనేక విషయాలను నేర్చుకున్నట్టుగా రాహుల్ గాంధీ పేర్కొన్నాడు.
Read Also: Rahul Gandhi: మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ టార్గెట్గా రాహుల్ గాంధీ విమర్శలు
2022 సెప్టెంబర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించి.. 12 రాష్ట్రాల మీదుగా 3,970 కిలోమీటర్లు కొనసాగింది. ఈ సంవత్సరం జనవరి 30వ తేదిన జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో పాదయాత్ర ముగిసింది. దాదాపు 130 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగింది. భారత్ జోడో యాత్ర రెండో విడత గుజరాత్ నుంచి ప్రారంభించనున్నట్లు పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించారు. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు పాదయాత్ర చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.
తాజావార్తలు
-
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
-
UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!