World Cup 2023: ప్రపంచకప్ చరిత్రలోనే ఆసీస్ జట్టు రికార్డ్.. వరుసగా మూడోసారి 350కి పైగా స్కోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ 2023లో ఆసీస్ జట్టు తొలి మ్యాచ్ టీమిండియాపై, ఆ తర్వాతి మ్యాచ్ సౌతాఫ్రికాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత నుంచి ఆస్ట్రేలియా జట్టు పుంజుకుంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ వరుసగా విజయం సాధించింది. బ్యాటింగ్లో రాణించడం వల్లే ఆసీస్ జట్టు గెలుపొందిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ 350కి పైగా పరుగులు చేసింది. దీంతో ప్రపంచకప్ చరిత్రలోనే ఆసీస్ జట్టు అరుదైన రికార్డ్ ను సాధిచింది. వరుసగా మూడోసారి 350కి పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.
Read Also: Travis Head: ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన రికార్డ్
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ఈరోజు ధర్మశాలలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచకప్ 27వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ దూకుడు ఇన్నింగ్స్ తో జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. 19.1 ఓవర్లలో 175 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్లు స్కోరును ముందుకు తీసుకెళ్లడంతో చివరికి ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయింది. గతంలో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా.. ఇదే తరహాలో బ్యాటింగ్ చేసింది.
Read Also: Janga Raghava Reddy: నాపై కుట్ర చేసి ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారు..
అంతకు ముందు పాకిస్థాన్తో ఆడిన మ్యాచ్ లో.. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. పాకిస్థాన్ జట్టు 45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌట్ అయి మ్యాచ్ ఓడిపోయింది. దీంతో ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్ల్లో 350 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!