Thatikonda Rajaiah : కడియం మాటలు.. అబద్దాల మూటలు…
- ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదనడం కడియం దివాలాకోరుతనం
- గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను.. కడియం శ్రీహరి ప్రారంభించడం సిగ్గుచేటు
- కడియం మాటలు..అబద్దాల మూటలు: తాటికొండ రాజయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thatikonda Rajaiah : ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదనడం కడియం దివాలాకోరుతనమని తాటికొండ రాజయ్య మండిపడ్డారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను.. కడియం శ్రీహరి ప్రారంభించడం సిగ్గుచేటని, కడియం మాటలు..అబద్దాల మూటలు అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఘనపూర్ కు ఇరిగేషన్ పనులు మంజూరయ్యాయన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియంను గెలిపిస్తే..రేవంత్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, సక్రమ సంబంధం అయితే.. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు తాటికొండ రాజయ్య. కడియం నిజ స్వరూపం తెలిసే…కాంగ్రెస్ నాయకులు ఓడగొట్టేందుకు ప్రయత్నం చేశారని, దేవాదుల పథకానికి కడియం శ్రీహరి వ్యతిరేకమన్నారు. దేవాదుల సృష్టికర్త కాదు, దేవాదుల వ్యతిరేక కర్త అని, ధర్మసాగర్ సౌత్ కెనాల్ నుండి నీరు విడుదల చేయొద్దని, గేట్ల తాళాలు నీటిలో వేసిన ఘనుడు కడియమన్నారు తాటికొండ రాజయ్య.
VD 12: జెర్సీ చేసిన డైరెక్టరేనా? వీడీ 12 చూసి షాక్.. హైపెక్కించేస్తున్న నాగవంశీ
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అంతేకాకుండా..’దేవాదుల ప్రాజెక్టులో ఒక్క తట్ట మట్టి తీసింది లేదు. దేవాదుల ప్రాజెక్టులో నీటిని నింపిన చరిత్ర నాది. బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం.. ఘనపూర్ ను తాకట్టు పెట్టిన కడియం. నువ్వు పనులు చేయకుండా..గత ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు. ఇరిగేషన్ రంగాన్ని మొదటి దశలో ఉంచిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది. లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతు అకౌంట్లలో జమ చేసిన ఘనత బీఆర్ఎస్ది. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ రేసు లో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈడి, ఎసిబి నోటీసులు పంపడం విడ్డూరం. అక్రమ కేసులు, నిర్భందాలు, ఎంకౌంటర్లు కడియం ప్రత్యేకత. నియోజకవర్గానికి కడియం చేసింది గుండు సున్న. మాట్లాడేటప్పుడు కడియం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.
మరోసారి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే… తాట తీస్తాం.’ అని తాటికొండ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.
US: విషాదం.. భోజనం చేస్తుండగానే యూఎస్ ఇన్ఫ్లుయెనర్స్ హఠాన్మరణం
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!