Thammineni Veerabhadram : భావ ప్రకటనా స్వేచ్ఛ, పరిశోధనలపై దాడిని ఖండించండి
- భావ ప్రకటనా స్వేచ్ఛ, పరిశోధనలపై దాడిని ఖండించండి
- ఎన్ వేణుగోపాల్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని సీపీఐ(ఎం) ఖండిస్తున్నది :తమ్మినేని వీరభద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thammineni Veerabhadram : ‘వీక్షణం’ సంపాదకులు ఎన్ వేణుగోపాల్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. తమకు నచ్చని పుస్తకాన్ని అమ్ముతున్నారనే పేరుతో వేణుగోపాల్ పై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద పరిశోధనలు జరిపిన ఒక చరిత్రకారుడు, అది పూర్వం బౌద్ధక్షేత్రం అనీ, దానికి ఆధారాలున్నాయని 40 సంవత్సరాల క్రితం పుస్తకం విడుదల చేశారని, ఇప్పుడు అది తెలుగులో వెలువడినది. హైద్రాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో ఆ పుస్తకం అమ్మకానికి పెట్టడాన్ని వీరు ప్రశ్నిస్తున్నారన్నారు.
ఈ చర్యలు భావ ప్రకటనా స్వేచ్ఛ మీద, పరిశోధనల మీద దాడి అని ఆయన అభివర్ణించారు. ఆ పుస్తకాలలో చెప్పిన విషయాలపై అభ్యంతరాలున్నవారు వాటిని ఖండిస్తూ మరో పుస్తకం రాయవచ్చు. ప్రకటనలు చేయవచ్చు. కానీ ఒక మతానికి చెందినవారిని రెచ్చగొట్టి దాడులకు ప్రోత్సహించటం ప్రమాదకరమన్నారు తమ్మినేని వీరభద్రం.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Kerala political Murders: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల హత్య.. 10 మందికి జీవిత ఖైదు..
అంతేకాకుండా.. ‘ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, వీటిని ఖండిరచాలనీ ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాము. సోషల్ మీడియాలో ఇలాంటి క్యాంపెయిన్ చేస్తున్నవారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గౌరీ లంకేష్, ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గి, నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే లాంటి మేధావులను ఇలాంటి శక్తులు హత్య చేశారు. రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టు తులసిచందుపై కూడా ఇదే పద్ధతిలో దాడులకు ఉసి గొలుపుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. శాస్త్రీయ విమర్శలకు తట్టుకోలేనివారు, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే శక్తులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. ఇలాంటి స్వార్ధపరుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నది.’ అని తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?