Thammineni Veerabhadram : భావ ప్రకటనా స్వేచ్ఛ, పరిశోధనలపై దాడిని ఖండించండి
- భావ ప్రకటనా స్వేచ్ఛ, పరిశోధనలపై దాడిని ఖండించండి
- ఎన్ వేణుగోపాల్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని సీపీఐ(ఎం) ఖండిస్తున్నది :తమ్మినేని వీరభద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thammineni Veerabhadram : ‘వీక్షణం’ సంపాదకులు ఎన్ వేణుగోపాల్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. తమకు నచ్చని పుస్తకాన్ని అమ్ముతున్నారనే పేరుతో వేణుగోపాల్ పై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద పరిశోధనలు జరిపిన ఒక చరిత్రకారుడు, అది పూర్వం బౌద్ధక్షేత్రం అనీ, దానికి ఆధారాలున్నాయని 40 సంవత్సరాల క్రితం పుస్తకం విడుదల చేశారని, ఇప్పుడు అది తెలుగులో వెలువడినది. హైద్రాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో ఆ పుస్తకం అమ్మకానికి పెట్టడాన్ని వీరు ప్రశ్నిస్తున్నారన్నారు.
ఈ చర్యలు భావ ప్రకటనా స్వేచ్ఛ మీద, పరిశోధనల మీద దాడి అని ఆయన అభివర్ణించారు. ఆ పుస్తకాలలో చెప్పిన విషయాలపై అభ్యంతరాలున్నవారు వాటిని ఖండిస్తూ మరో పుస్తకం రాయవచ్చు. ప్రకటనలు చేయవచ్చు. కానీ ఒక మతానికి చెందినవారిని రెచ్చగొట్టి దాడులకు ప్రోత్సహించటం ప్రమాదకరమన్నారు తమ్మినేని వీరభద్రం.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Kerala political Murders: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల హత్య.. 10 మందికి జీవిత ఖైదు..
అంతేకాకుండా.. ‘ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, వీటిని ఖండిరచాలనీ ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాము. సోషల్ మీడియాలో ఇలాంటి క్యాంపెయిన్ చేస్తున్నవారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గౌరీ లంకేష్, ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గి, నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే లాంటి మేధావులను ఇలాంటి శక్తులు హత్య చేశారు. రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టు తులసిచందుపై కూడా ఇదే పద్ధతిలో దాడులకు ఉసి గొలుపుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. శాస్త్రీయ విమర్శలకు తట్టుకోలేనివారు, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే శక్తులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. ఇలాంటి స్వార్ధపరుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నది.’ అని తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..