Thammineni Veerabhadram : భావ ప్రకటనా స్వేచ్ఛ, పరిశోధనలపై దాడిని ఖండించండి
- భావ ప్రకటనా స్వేచ్ఛ, పరిశోధనలపై దాడిని ఖండించండి
- ఎన్ వేణుగోపాల్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని సీపీఐ(ఎం) ఖండిస్తున్నది :తమ్మినేని వీరభద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thammineni Veerabhadram : ‘వీక్షణం’ సంపాదకులు ఎన్ వేణుగోపాల్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. తమకు నచ్చని పుస్తకాన్ని అమ్ముతున్నారనే పేరుతో వేణుగోపాల్ పై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద పరిశోధనలు జరిపిన ఒక చరిత్రకారుడు, అది పూర్వం బౌద్ధక్షేత్రం అనీ, దానికి ఆధారాలున్నాయని 40 సంవత్సరాల క్రితం పుస్తకం విడుదల చేశారని, ఇప్పుడు అది తెలుగులో వెలువడినది. హైద్రాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో ఆ పుస్తకం అమ్మకానికి పెట్టడాన్ని వీరు ప్రశ్నిస్తున్నారన్నారు.
ఈ చర్యలు భావ ప్రకటనా స్వేచ్ఛ మీద, పరిశోధనల మీద దాడి అని ఆయన అభివర్ణించారు. ఆ పుస్తకాలలో చెప్పిన విషయాలపై అభ్యంతరాలున్నవారు వాటిని ఖండిస్తూ మరో పుస్తకం రాయవచ్చు. ప్రకటనలు చేయవచ్చు. కానీ ఒక మతానికి చెందినవారిని రెచ్చగొట్టి దాడులకు ప్రోత్సహించటం ప్రమాదకరమన్నారు తమ్మినేని వీరభద్రం.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
Kerala political Murders: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల హత్య.. 10 మందికి జీవిత ఖైదు..
అంతేకాకుండా.. ‘ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, వీటిని ఖండిరచాలనీ ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాము. సోషల్ మీడియాలో ఇలాంటి క్యాంపెయిన్ చేస్తున్నవారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గౌరీ లంకేష్, ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గి, నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే లాంటి మేధావులను ఇలాంటి శక్తులు హత్య చేశారు. రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టు తులసిచందుపై కూడా ఇదే పద్ధతిలో దాడులకు ఉసి గొలుపుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. శాస్త్రీయ విమర్శలకు తట్టుకోలేనివారు, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే శక్తులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. ఇలాంటి స్వార్ధపరుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నది.’ అని తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!