TGO- TNGO: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Govt Employees Association: బీఆర్కే భవన్ లో పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ ను టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా రెండవ పీఆర్సీని 1.7. 2023 నుంచి 51 శాతం ఫిట్మెంట్ తో ఆనాటికి ఉన్న 33.67 శాతం మొత్తం కలిపి అందజేయాలి అని కోరారు. ఇక, కనిష్ట వేతనం 35,000 నుంచి గరిష్ట వేతనం 2,99,100 రూపాయలు ఇవ్వాలన్నారు.
Read Also: SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..
Also Read
- RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
- Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
ఇక, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలి అని టీజీఓ, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్క్రీన్ ను ఇప్పుడున్న 6/ 12 /18 /24 స్థానాలలో 5/ 10 /15 /20 25 లుగా ఇవ్వాలన్నారు. అయితే, ఇంటి అద్దె బత్యాన్ని జీహెచ్ఎంసీ పరిధిలో 27 శాతంగా 2 లక్షలకు పై జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్ లో 18.5 శాతంగా 50 వేల కంటే ఎక్కువగా రెండు లక్షల కంటే తక్కువ జనాభా గలిగిన మండల కేంద్రాల్లో 14 శాతం అలాగే, మిగతా స్థానాల్లో 11.5 శాతం అద్దె చెల్లించాలి అని డిమాండ్ చేశారు.
Read Also: Minister Ponguleti: రెవెన్యూ సెక్టార్ లో అవినీతిని పూర్తిగా అంతరించాలి..
అయితే, కనీస పెన్షన్ మొత్తాన్ని 9,500 నుంచి 17,500 రూపాయలకు పెంచాలి అని టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఇక, రిటైర్మెంట్ గ్రాట్యుటీ 16 లక్షల నుంచి 24 లక్షలు పెంచాలన్నారు. 15 సంవత్సరాల సర్వీసు నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగి కానీ పెన్షనర్లు కానీ చనిపోతే ఇప్పుడున్న 30 వేల దహన ఖర్చులను 75 వేల రూపాయలకు పెంచాలి అని కోరారు. అయితే, హౌస్ బిల్డింగ్ అడ్వాన్సులను ఇప్పుడున్న స్థానాన్ని పెంచి 30, 40, 50 లక్షలుగా ఇవ్వాలి అని పేర్కొన్నారు. అలాగే, కామన్ క్యాటగిరి ఉద్యోగుల వేతనాన్ని గత కొన్ని పీఆర్సీలలో నెగ్లెట్ చేస్తున్నారు.. కనుక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపర్నెంట్ స్కేల్స్ ను ధరల ఆధారంగా పెంచి ఇవ్వాలన్నారు. పీఆర్సీ కమిటీ ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోపలనే తన నివేదికని ప్రభుత్వానికి సమర్పించాలి అని టీజీవో- టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
-
Virat Kohli: నన్ను త్వరగా అవుట్ చేయాలని అందరూ చూస్తారు.. ఏం పర్లేదు, నా ప్లాన్స్ నాకుంటాయి!
-
Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
-
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
Dell XPS 13 (2026): డెల్ XPS 13 ల్యాప్టాప్ విడుదల.. 32GB RAM, 2.5K టచ్స్క్రీన్తో ఆకట్టుకుంటున్న కొత్త మోడల్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!