Hyderabad: హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి
- మూసీ, ఈసా నదుల ఒడ్డున ఇంటి నిర్మాణాలు చేపట్టొద్దన్న సీఎం..
- ఇప్పటికే ఉన్న నిర్మాణాలను తొలగించాల్సిందే..
- ప్రత్యామ్నాయంగా భూమి, అవసరమైన నిధులు అందజేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్’ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. నగర జీవనాడి అయిన మూసీ, ఈసా నదుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని.. అయితే ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. నదుల ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్ అత్యంత కీలకం. ఈ పరిధిలో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు ఉండకూడదనే నిబంధనను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయనుంది. నది ప్రవాహానికి అడ్డంకులుగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా భవిష్యత్తులో వరద ముప్పును నివారించడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
Also Read:LPG Cylinder Booking Rules Changed: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయ్..
ఈ క్రమంలో ఇళ్లు కోల్పోతున్న పేదలను ప్రభుత్వం అస్సలు వదిలేయదు. వారికి ప్రత్యామ్నాయంగా సురక్షితమైన ప్రాంతాల్లో భూమి కేటాయించడం లేదా ఆధునిక వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. అలాగే.. వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన పరిహారం, ఇతర సహాయ సహకారాలను అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also Read:Bamruk-ud-Daula lake: హైదరాబాద్లో ప్రారంభానికి సిద్ధంగా మరో చెరువు.. సంతోషంలో స్థానికులు..
కొన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్టును తప్పుదారి పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని సీఎం మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల ఎవరికీ లాభం లేదని, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. నగరాన్ని సుందరీకరించడం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మొత్తంగా.. మూసీ పునరుజ్జీవం అనేది కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు అత్యంత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Realme 17 Pro+: రియల్మీ 17 ప్రో+.. 200MP కెమెరా, 1.5K OLED డిస్ప్లేతో అదుర్స్! లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!