Hyderabad: హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి
- మూసీ, ఈసా నదుల ఒడ్డున ఇంటి నిర్మాణాలు చేపట్టొద్దన్న సీఎం..
- ఇప్పటికే ఉన్న నిర్మాణాలను తొలగించాల్సిందే..
- ప్రత్యామ్నాయంగా భూమి, అవసరమైన నిధులు అందజేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్’ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. నగర జీవనాడి అయిన మూసీ, ఈసా నదుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని.. అయితే ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. నదుల ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్ అత్యంత కీలకం. ఈ పరిధిలో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు ఉండకూడదనే నిబంధనను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయనుంది. నది ప్రవాహానికి అడ్డంకులుగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా భవిష్యత్తులో వరద ముప్పును నివారించడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
- BCCI: క్రికెట్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. IPL 2027 షెడ్యూల్పై బీసీసీఐ సంచలన నిర్ణయం
- Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
- PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
Also Read:LPG Cylinder Booking Rules Changed: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయ్..
ఈ క్రమంలో ఇళ్లు కోల్పోతున్న పేదలను ప్రభుత్వం అస్సలు వదిలేయదు. వారికి ప్రత్యామ్నాయంగా సురక్షితమైన ప్రాంతాల్లో భూమి కేటాయించడం లేదా ఆధునిక వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. అలాగే.. వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన పరిహారం, ఇతర సహాయ సహకారాలను అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also Read:Bamruk-ud-Daula lake: హైదరాబాద్లో ప్రారంభానికి సిద్ధంగా మరో చెరువు.. సంతోషంలో స్థానికులు..
కొన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్టును తప్పుదారి పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని సీఎం మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల ఎవరికీ లాభం లేదని, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. నగరాన్ని సుందరీకరించడం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మొత్తంగా.. మూసీ పునరుజ్జీవం అనేది కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు అత్యంత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
-
OnePlus Pad 3 Pro: వన్ప్లస్ ప్యాడ్ 3 ప్రో టాబ్లెట్ విడుదల.. 13,380mAh బ్యాటరీ, 16GB RAM
-
BCCI: క్రికెట్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. IPL 2027 షెడ్యూల్పై బీసీసీఐ సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!