Poonch attack: ఉగ్రవాదుల ఫొటోలు విడుదల.. పాక్ హస్తం ఉన్నట్లుగా గుర్తింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం జమ్మూకాశ్మీర్లోని పూంచ్లో వైమానిక దళం కాన్వాయ్పై లష్కర్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దీని వెనుక పాక్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దర్యాప్తులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదుల చిత్రాలను సేకరించాయి. వీరిలో పాక్ సైన్యం ప్రత్యేక దళాల్లో పనిచేసిన ఓ మాజీ కమాండో కూడా ఉండటం విశేషం. ఇల్లియాస్, అబూ హమ్జా, హడూన్గా గుర్తించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ తరఫున ఈ ముగ్గురు ఉగ్రవాదులు కాన్వాయ్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ జైషే అహ్మద్ అనుబంధంగా పనిచేస్తోంది. భద్రతా దళాలు ఈ ఉగ్రవాదులను పట్టుకోవడానికి రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో భారీ గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: KGF 3: కేజీఎఫ్ 3పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్ రెడీనా..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ముగ్గురు ఉగ్రవాదులు హై పవర్డ్ రైఫిల్స్ను ఉపయోగించినట్లు సమాచారం. వీరి వయసు 30-32 ఏళ్ల మధ్య ఉంటుంది. ఏకే 47 రైఫిల్స్తో పాటు, అమెరికా తయారీ ఎం-4 కార్బైన్ను, స్టీల్ తూటాలను వాడినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో కూడా సైనిక వాహనంపై పీఏఎఫ్ఎఫ్ సంస్థ ఉగ్రవాదులు మాటు వేసి దాడి చేశారు. నాటి ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందారు. అప్పుడు కూడా స్టీల్ తూటాలు వాడినట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy : తడిసిన ధాన్యంపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
మే 4న కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో వైమానిక దళ సైనికుడు మృతిచెందగా.. ఐదుగురు సహచరులు గాయపడ్డారు. పూంచ్ అనంత్నాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఇక్కడ ఆరవ దశలో మే 25న పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Car Sales In April 2024 : ఏప్రిల్లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!