కన్నడ స్టార్ హీరో రాఖీ బాయ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సిరీస్ సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే.. రెండు పార్ట్ లు భారీ విజయాన్ని అందుకోవడంతో పార్ట్ 3 కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు… ఈ సినిమా గురించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్న ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు..
ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ 2 ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ 2 షూటింగ్ ఈ నెలాఖరులో మొదలవుతుందని అన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కేజీఎఫ్ 3 గురించి అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.. ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు…
కేజీఎఫ్ 2 తర్వాత 3 కూడా ఉంటుందని ప్రకటించడంతో ఫ్యాన్స్ సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ దీనిపై ఇప్పటివరకూ నీల్ మాట్లాడలేదు. కానీ తాజాగా ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 3 పనులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. స్టోరీలైన్ పూర్తయ్యేందుకు చివరి దశలో ఉందన్నారు.. ఈ నెల ఆఖరు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను పట్టాలెక్కించనున్నాడు.. ఈ ఏడాది చివర్లో మొదలు అవుతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..