Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్.. మధ్యప్రదేశ్లో టెన్షన్ టెన్షన్..
- 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్..
- భయపెట్టి వీడియో తీసిన నిందితులు..
- మధ్యప్రదేశ్ షామ్గఢ్లో టెన్షన్ టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షామ్గఢ్ నగరంలో శుక్రవారం 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్ అవ్వడం, ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్న భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. బాధితురాలు 12వ తరగతి చదువుతోంది. ఈ ఘటన తర్వాత షామ్ గఢ్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అధికారులు దాదాపుగా ఇంటర్నెట్ షెట్ డౌన్ చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పొరుగు జిల్లాల నుంచి కూడా అదనపు పోలీస్ సిబ్బందిని తరలించారు. ఈ ఘటన వెనక ఉన్న ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
Read Also: Tragedy: అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి..
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
నవంబర్ 6న మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రిహాన్, బాబు అనే ఇద్దరు నిందితులు, కత్తిలో బెదిరించి బాలిక తల్లి సెల్ఫోన్ లో బాలిక అశ్లీల వీడియో తీశారు. ఆ తర్వాత ఆ వీడియోను నిందితులు తమ సెల్ఫోన్కు పంపించుకున్నారు. వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. తమకు రూ. 5 లక్షలు ఇవ్వాలని కుటుంబాన్ని బెదిరించారు. బాధిత కుటుంబం బాలిక జీవితం నాశనమవుతుందని రూ. 2 లక్షలు ఇచ్చారు. మిగిలిన డబ్బు కోసం నిందితులు బలవంతం చేశారు. ఆ తర్వాత గురువారం సాయంత్రం ఈ వీడియోను ఆ ప్రాంతంలో వైరల్ చేశారు.
ఈ సంఘటన తర్వాత నిందితులపై చర్యలు తీసుకోవాలని షామ్గఢ్ పోలీస్ స్టేషన్ ముందు వందలాది మంది ఆందోళన నిర్వహించారు. శుక్రవారం హిందూ సంస్థలు కూడా నిరసనలో చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షామ్ గఢ్ ప్రాంతంలో దుకాణాలు మూసేశారు. నిందితులను పోలీసులు 12 గంటల్లోనే అరెస్ట్ చేశారు. మున్సిపాలిటీ రిహాన్, బాబులకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు ప్రారంభించింది. నీటి కనెక్షన్లను తొలగించింది. ఈ ఘటనపై పోలీసులు పోక్సో, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!