Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana State Assembly Budget Sessions To Begin From Today Onwards

Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

NTV Telugu Twitter
Published Date :March 12, 2025 , 8:21 am
By Kothuru Ram Kumar
  • నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
  • ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ భవనంలో షురూ.
  • మొదటి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం.
Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Assembly Sessions: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 13) ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ భవనంలో ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల వ్యవధి, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 14న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఆ తీర్మానం ఆమోదం పొందిన తరువాత సభ వాయిదా పడనుంది.

Read Also: Bhadrachalam: ఆన్‌లైన్‌లో భద్రాచలం శ్రీరామనవమి కల్యాణోత్సవ టికెట్లు.. ఈఓ వెల్లడి

ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ గత బడ్జెట్ కంటే దాదాపు 10 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. గత ఏడాది రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి రూ.3.20 లక్షల కోట్ల బడ్జెట్ ఉండొచ్చని సమాచారం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఆమోదం పొందిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రెండు ముఖ్యమైన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. వీటిలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు ఉన్నాయి. ఈ బిల్లులపై చర్చ జరిపి, ఆమోదించనున్నారు. మార్చి 19 లేదా 20న 2025-26 బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడతారు. మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్‌పై విభాగాల వారీగా చర్చ జరిగి, ఆమోదించేందుకు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీనికి అనుగుణంగా మార్చి 27 లేదా 29 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగవచ్చని అంచనా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఇప్పటికే మూడంచెల భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ తమ తమ వ్యూహాలతో సిద్ధమయ్యాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ప్రాధాన్యంగా తీసుకుంది. ముఖ్యంగా కులగణన, ఎస్సీల వర్గీకరణ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను ప్రస్తావించనుంది.

Read Also: Shahid Afridi: ఐసీయూలో పాకిస్తాన్ క్రికెట్.. పీసీబీపై విరుచుకుపడ్డ షాహిద్ అఫ్రిది

ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. ఆరు గ్యారంటీలు, కృష్ణా జలాలు, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం, కరువు పరిస్థితులు, సాగునీటి కొరత, రైతుల సమస్యలు వంటి అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది. బీజేపీ కూడా ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో తమ వ్యూహాలను అమలు చేయాలనీ భావిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Budget 2025-26
  • kcr
  • telangana assembly budget
  • telangana government
  • Telangana Politics

తాజావార్తలు

  • ‘OG’ : పవన్ కల్యాణ్ ‘OG’ లో జపనీస్ యాక్టర్..

  • Heatwave Warning: ఢిల్లీకి రెడ్ అలర్ట్.. 3 రోజులు తీవ్ర వేడిగాలులు ఉంటాయని హెచ్చరిక

  • Anantapur Crime: ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. కీలక వివరాలు వెల్లడి..!

  • Kingdom : కింగ్ డమ్ వాయిదా తప్పదా..?

  • Sonam Raja Wedding: సోదరుడి మరణాన్ని క్యాష్ చేసుకుంటున్న రాజా సోదరి.. పెళ్లి వీడియోలు వైరల్ చేస్తు్న్న ఇన్‌ఫ్లుయెన్సర్

ట్రెండింగ్‌

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • 2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions